తెలంగాణ

telangana

ETV Bharat / sports

మెస్సీని వెనక్కి నెట్టిన సునీల్ ఛెత్రి

భారత ఫుట్​బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి.. అంతర్జాతీయ మ్యాచ్​ల్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచాడు. రొనాల్డో టాప్​లో ఉండగా మెస్సీ మూడో స్థానంలో ఉన్నాడు.

By

Published : Jul 9, 2019, 7:01 PM IST

మెస్సీని వెనక్కి నెట్టిన ఫుట్​బాలర్ సునీల్ ఛెత్రి

భారత స్టార్ ఫుట్​బాలర్ సునీల్ ఛెత్రి అరుదైన ఘనత సాధించాడు. ఇదే ఏడాది రెండో సారి ప్రఖ్యాత ఆటగాడు మెస్సీని అధిగమించాడు. అంతర్జాతీయ ఫుట్​బాల్​ టోర్నీల్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచాడు.

ఈ జాబితాలో క్రిస్టియానో రొనాల్డో 88 గోల్స్​తో అగ్రస్థానంలో ఉన్నాడు. 70 గోల్స్ చేసిన ఛెత్రి రెండో స్థానంలో, 68 గోల్స్​తో మెస్సీ మూడో స్థానంలో ఉన్నాడు.

రొనాల్డో- ఛెత్రి- మెస్సీ

ఇదే ఏడాది ఇంటర్​ కాంటినెంటల్ కప్​లో తజికిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో ఈ రికార్డు సాధించాడు సునీల్ ఛెత్రి. భారత్​ తరఫున అత్యధిక మ్యాచ్​లాడిన ఈ ఆటగాడు మాజీ కెప్టెన్ బైచుంగ్ భాటియాను అధిగమించాడు.

ఇది చదవండి: మహిళల ఫిఫా వరల్డ్​కప్: నాలుగోసారి విజేతగా అమెరికా

ABOUT THE AUTHOR

...view details