2010లో ప్రారంభమైన శాఫ్ టోర్నీలో భారత్ ఒక్కసారీ ఓడిపోలేదు. ఈ ఫైనల్తో వరుసగా 23 మ్యాచ్లు గెలిచి తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.
- శాఫ్ మహిళల ఛాంపియన్ షిప్లో భారత్ 5వ సారి జయకేతనం ఎగురవేసింది. శుక్రవారం సాయంత్రం నేపాల్ వేదికగా సహీద్ రంగశాల స్టేడియంలో భారత్- నేపాల్ మధ్య ఫైనల్ జరిగింది. ఇందులో భారత మహిళా పుట్బాల్ జట్టు 3-1తో విజయం సాధించింది.
టాప్ స్కోరర్ టైటిళ్లతో భారత క్రీడాకారిణులు ఇందుమతి, దాల్మియా
తొలి గోల్ వాళ్లది.. విజయం మనది:
- తొలి అర్ధ భాగంలో భారత క్రీడాకారిణి దాల్మియా చిబ్బర్ మొదటి గోల్ చేసింది. దీంతో అప్పటివరకు ఒక పాయింట్తో ఆధిక్యంలో ఉన్న నేపాల్ స్కోరును సమం చేసింది.
- ద్వితీయ భాగంలో 63వ నిమిషంలో గ్రేస్ డెగ్మయి ఇండియాకు రెండో గోల్ అందించింది. అనంతరం 76వ నిమిషంలో అంజు తమంగ్ మూడో గోల్ కొట్టింది.
- ఈ మ్యాచ్ విజయంతో 5 సార్లు భారత్ శాఫ్ టైటిల్ గెలిచి రికార్డు సృష్టించింది.
.