స్టార్ ఫుట్బాల్ ఆటగాడు లియోనాల్ మెస్సీకి స్పానిష్ సాకర్ ఫెడరేషన్ జరిమానా విధించింది. ఇటీవల మృతి చెందిన దిగ్గజ ఫుట్బాలర్ మారడోనాకు మైదానంలో నివాళి అర్పిస్తూ జెర్సీ తీసినందుకు 600 యూరో(రూ.54 వేలు)లు ఫైన్ వేసింది. ఈ విషయాన్ని బుధవారం వెల్లడించింది. ఆదివారం, ఒషాసునా- బార్సిలోనా మ్యాచ్లో ఈ సంఘటన జరిగింది. ఇందులో 4-0 తేడాతో బార్సిలోనా గెలిచింది.
మారడోనాకు మెస్సీ నివాళి.. రూ.54 వేల జరిమానా - మారడోనాకు నివాళి
దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు మారడోనాకు మ్యాచ్ మధ్యలో నివాళి అర్పించినందుకు ప్రముఖ ఆటగాడు మెస్సీకి జరిమానా విధించారు. ఈ మ్యాచ్లో బార్సిలోనా విజయం సాధించింది.
![మారడోనాకు మెస్సీ నివాళి.. రూ.54 వేల జరిమానా Lionel Messi fined 600 euros for tribute to Maradona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9749575-505-9749575-1606988677954.jpg)
మ్యాచ్లో గోల్ కొట్టిన మెస్సీ.. బార్సిలోనా జెర్సీని తీసి.. లోపల వేసుకున్న ఎరుపు, నలుపు రంగులు కలిసున్న మరో జెర్సీతో మారడోనాకు నివాళి అర్పించాడు. ఈ సందర్భంగా రెండు చేతులతో ముద్దు పెడుతూ, ఆకాశం వైపు చూశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత తన ఫొటో, మారడోనా ఫొటోను కలిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఫుట్బాల్ దిగ్గజం డిగో మారడోనా(60).. గత బుధవారం గుండెపోటుతో మరణించాడు. అయితో చికిత్స అందించిన వైద్యుడి వల్లే డిగో మరణించాడని సందేహాలు వస్తున్న నేపథ్యంలో అర్జెంటీనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.