తెలంగాణ

telangana

WTC Final: విజేతకు ప్రైజ్​మనీ ఎంతంటే?

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్ మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు ఇవ్వబోయే ప్రైజ్​మనీ ఎంత? రన్నరప్​కు ఏం లభిస్తుంది? అన్న విషయాలు తెలుసుకుందాం.

By

Published : Jun 18, 2021, 9:02 AM IST

Published : Jun 18, 2021, 9:02 AM IST

Updated : Jun 18, 2021, 9:43 AM IST

WTC Final
డబ్ల్యూటీసీ ఫైనల్

సౌథాంప్టన్​ వేదికగా ప్రపంచ టెస్టు​ ఛాంపియన్​షిప్​ ఫైనల్ మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. భారత్-న్యూజిలాండ్ మధ్య జరగబోయే ఈ మ్యాచ్​ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 9 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో టైటిల్ విజేతగా నిలిచిన జట్టుకు ఎంత ప్రైజ్​మనీ రాబోతుంది. రన్నరప్​తో పాటు మిగతా జట్లకు ఏం లభిస్తుంది? అన్న విషయాలు తెలుసుకుందాం.

  • విజేతకు ఐసీసీ టెస్టు​ ఛాంపియన్​షిప్​ గదతో పాటు రూ.11.71 కోట్ల (1.6 మిలియన్​ డాలర్లు)ను బహుమతిగా ఇస్తారు.
  • డబ్ల్యూటీసీ ఫైనల్​లో ఓడిన జట్టు(రన్నరప్) రూ.5.85 కోట్ల (8 లక్షల డాలర్లు)ను బహుమతిగా పొందుతుంది.
  • మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.3.29 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన టీమ్​కు రూ.2.56 కోట్లు, తర్వాత స్థానాల్లో నిలిచిన జట్లకు వరుసగా రూ.1.46 కోట్లు, రూ.73 లక్షలు.. ప్రైజ్​మనీగా దక్కనున్నాయి.

గతంలో డబ్ల్యూటీసీ విజేతలుగా నిలిచిన జట్లకు గదను బహుమతిగా ఇచ్చేవారు. ఏడాది చివరి నాటికి ఏ టీమ్​ అయితే ర్యాంకింగ్స్​లో అగ్రస్థానంలో ఉంటుందో ఆ జట్టును విజేతగా ప్రకటించేవారు.

ఇవీ చూడండి: WTC FINAL: తొలి ఛాంపియన్​షిప్​ వరించేదెవరిని?

Last Updated : Jun 18, 2021, 9:43 AM IST

ABOUT THE AUTHOR

...view details