తెలంగాణ

telangana

పాక్​కు వరుస షాక్​లు.. టీమ్​ఇండియాకు జరిగిన మేలు

ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టులో ఓడిపోయిన పాకిస్థాన్​కు షాక్ మీద షాక్​లు తగిలాయి. ఆ వివరాలు..

By

Published : Dec 6, 2022, 4:05 PM IST

Published : Dec 6, 2022, 4:05 PM IST

World test championship pakisthan
పాక్​కు వరుస షాక్​లు.. టీమ్​ఇండియాకు జరిగిన మేలు

ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టులో ఓడిపోయిన పాకిస్థాన్​కు దెబ్బ మీద దెబ్బ తగిలింది. ఈ ఓటమి.. వరల్డ్‌టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) 2021-23 ఫైనల్‌ చేరాలని ఉవ్విళ్లూరుతున్న బాబర్‌ ఆజం టీమ్​కు అవకాశాలను సంక్లిష్టం చేసింది. అలానే ఇది భారత్​కు కూడా మేలు చేసింది. టెస్టు ఛాంపియన్‌షిఫ్‌ ఫైనల్‌ చేరే అవకాశాలు భారత్‌కు మరింత మెరుగయ్యాయి.

డబ్ల్యూటీసీ ప్రస్తుత సీజన్‌లో భాగంగా పాకిస్థాన్​ ఈ సిరీస్‌ ఆరంభానికి ముందు పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్​తో భారీ పరాజయం తర్వాత కూడా పాక్‌ అదే స్థానంలో ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా, టీమ్​ఇండియా విజయశాతాలతో పోలిస్తే మరింత వెనుకబడింది. దీంతో ఫైనల్‌ చేరాలంటే మిగిలిన మ్యాచ్‌లలో తప్పక గెలవడం సహా ఇతర జట్ల తాజా సిరీస్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి వచ్చింది. కాగా, బంగ్లాదేశ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌ను టీమ్‌ఇండియా 2-0తో గెల్చుకుని.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఓడిపోకపోతే.. భారత్‌ టాప్‌ 2 ప్లేస్‌లో నిలిచే అవకాశం కూడా ఉంది.

పేసర్ దూరం..ఇకపోతే పాకిస్థాన్​ జట్టు పేసర్‌ హరీస్ రౌఫ్‌ గాయం కారణంగా సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఈ చారిత్రాత్మక టెస్టులో మొదటి రోజు ఫీల్డింగ్‌ చేస్తుండగా రౌఫ్‌ కుడి కాలికి గాయమైంది. అనంతరం అతడిని ఆస్పత్రికి తరిలించి స్కాన్‌ చేయించగా గాయం తీవ్రమైనదిగా తేలింది. దీంతో అతడికి దాదాపు నెల రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమచారం. ఈ క్రమంలోనే హరీస్ మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఇక గాయపడిన రౌఫ్‌ స్థానంలో ఫహీమ్ అష్రఫ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే స్టార్‌ పేసర్‌ షాహీన్‌ షా అఫ్రిది గాయం కారణంగా దూరం కాగా.. ఇప్పుడు రౌఫ్‌ దూరం కావడం పాక్‌ను కలవరపెడుతోంది.

ఇదీ చూడండి:తొలగించనున్న స్టేడియం 974 చివరిసారిగా చూసేయండి

ABOUT THE AUTHOR

...view details