మహిళల టీ20 వరల్డ్ కప్లో టీమ్ఇండియా బోణీ కొట్టింది. 7 వికెట్ల తేడాతో పాక్పై ఘన విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్(53), రీచా ఘోష్(31) ఆఖరి వరకు పోరాడి జట్టును విజయతీరాలకు నడిపించారు. షెఫాలి వర్మ(33) రాణించగా.. యాస్తికా భాటియా(17) హర్మన్ప్రీత్(16) పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. పాక్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో 3 వికెట్ల కోల్పోయి ఛేదించారు. ఇక పాక్ బౌలర్లలో నష్రా సంధు(2) వికెట్ల తీయగా.. సాదియా ఇక్బాల్(1) వికెట్ పడగొట్టింది.
అదరగొట్టిన టీమ్ఇండియా.. పాక్పై ఘన విజయం.. - ఇండియా పాకిస్థాన్ మహిళల టీ20 వరల్డ్ కప్
మహిళల టీ20 వరల్డ్ కప్లో టీమ్ఇండియా బోణీ కొట్టింది. 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్పై ఘన విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్, రీచా ఘోష్ అద్భుత ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

womens t20 world cup 2023
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ మహిళల జట్టు.. నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. మరూఫ్(68*) పరుగులతో అద్భుత ప్రదర్శన చేసింది. ఆయేష నసీమ్(43*) రాణించింది. మనీబా(12), జావేరి ఖాన్(8), అమీన్(1) అంతగా ఆకట్టుకోలేక పోయారు. నిద దార్ డక్ ఔట్ అయింది. టీమ్ఇండియా బౌలర్లు రాధ యాదవ్(2) వికెట్లతో రాణించగా.. దీప్తి సర్మ, పూజ వస్త్రాకర్ చెరో వికెట్ తీశారు.
Last Updated : Feb 12, 2023, 10:09 PM IST