ఇంగ్లాండ్ వేదికగా జరిగిన టీ20 బ్లాస్ట్ టోర్నీలో జో రూట్ సారథ్యంలోని యార్క్షైర్ జట్టు ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారు. లంకాషైర్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా.. రన్నింగ్ చేస్తుండగా గాయపడిన ఆటగాడిని రనౌట్ చేయకుండా ఆగిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. జో రూట్ బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అసలేం జరిగింది..
తొలుత బ్యాటింగ్కు దిగిన యార్క్షైర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 128 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన లంకాషైర్ లక్ష్యం దిశగా సాగింది. 18 బంతుల్లో 17 పరుగులు చేయాల్సిన సమయంలో స్టీవెన్ క్రాఫ్ట్ పరుగు కోసం ప్రయత్నించాడు. పిచ్ మధ్యలోకి వచ్చాక.. అతడి కాలుకు గాయమైంది. నొప్పితో విలవిలలాడిన క్రాఫ్ట్.. అక్కడే పడిపోయాడు. దీంతో రనౌట్ చేసే అవకాశమున్నప్పటికీ.. యార్క్షైర్ కెప్టెన్ జో రూట్ ఔట్ చేయలేదు. ఆ తర్వాత గాయపడిన క్రాఫ్ట్ దగ్గరికెళ్లి ఆటగాళ్లు అతడికి సాయమందించారు.
ఇదీ చదవండి:శునకంతో రవిశాస్త్రి క్యాచ్ల ప్రాక్టీస్.. వీడియో వైరల్