Virat Kohli World Cup :ముంబయి వాంఖడే వేదికగా నవంబర్ 2న శ్రీలంక - భారత్ మ్యాచ్లో టీమ్ఇండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచకప్ ప్రారంభం నుంచే.. భారత్ ఆడుతున్న ప్రతీ మ్యాచ్కు ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చిన ఆడియోన్స్.. చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తూ ఎంజాయ్ గేమ్ను చేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం నాటి మ్యాచ్లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి బౌలింగ్ ఇవ్వాలంటూ ఫ్యాన్స్ స్లోగన్స్ ఇస్తూ సందడి చేశారు.
మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్లో శ్రీలంక.. త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. 20 పరుగుల లోపే లంక.. ఆరు కీలక వికెట్లు చేజార్చుకుంది. దీంతో భారత్ విజయం దాదాపు ఖరారైందని స్టేడియంలో ఫ్యాన్స్.. అప్పుడే సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే శ్రీలంక 23/7 స్థితిలో ఉండగా, కొందరు టీమ్ఇండియా అభిమానులు.. 'కోహ్లి కో బౌలింగ్ దో(Kohli Ko Bowling Do!)' అంటూ స్లోగన్స్ ఇచ్చారు. అంటే, కోహ్లికి బౌలింగ్ వేసే అవకాశం ఇవ్వండి అని అర్థం. ఇది విన్న విరాట్.. స్టాండ్స్లో ఉన్న అభిమానుల వైపు చూస్తూ ఫన్నీగా స్పందించాడు. కొద్దిసేపటి తర్వాత, అభిమానుల కోరిక కాదనలేక చేతిలో బౌల్ లేకుండానే వార్మప్ మాదిరిగా సరదాగా బౌలింగ్ యాక్షన్లో పరిగెత్తాడు. అంతే ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.