తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆట ఆగింది.. సాయం మొదలైంది! - ఆగిన ఐపీఎల్​.. ఇక దృష్టంతా సాయంపైనే!

కొవిడ్ కేసుల నేపథ్యంలో ఐపీఎల్​ వాయిదా పడింది. దీంతో కరోనాపై పోరాటం చేయడానికి నడుం బిగించాడు టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ప్రస్తుతం శివసేన యువజన విభాగ సభ్యుడు విరాట్​ను కలిశాడు.

virat kohli, team india captain
విరాట్ కోహ్లీ, టీమ్​ఇండియా కెప్టెన్

By

Published : May 7, 2021, 9:53 AM IST

ఐపీఎల్​ వాయిదాతో బబుల్​ నుంచి ఇంటికి చేరుకున్న ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇక కరోనాపై పోరాటంలో తనవంతు సాయంగా చేయాల్సిన కార్యక్రమాలపై దృష్టి పెట్టాడు. రెండో దశ వైరస్​తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా ఉండడం కోసం ఓ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని కోహ్లీ, అతని భార్య అనుష్క ఇటీవల వెల్లడించారు.

అందులో భాగంగానే టీమ్ఇండియా సారథి కోహ్లీని.. శివసేన యువజన విభాగమైన యువసేన సభ్యుడు రాహుల్ కలిశాడు. "కెప్టెన్​ను కలిశాను. కొవిడ్ నుంచి ఉపశమనం కోసం అతను మొదలెట్టిన ఉద్యమంపై గౌరవం, ప్రేమ ఉన్నాయి. చెప్పడానికి మాటలేమీ లేవు.. కేవలం గౌరవం మాత్రమే ఉంది. తన ప్రయత్నాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నా" అని రాహుల్ తెలిపాడు.

ఇదీ చదవండి:ఆర్చరీ ప్రపంచకప్‌కు భారత్‌ దూరం!

ABOUT THE AUTHOR

...view details