విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదులుకోవడం అనే అంశం గురించే గత కొద్దిరోజులుగా క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. పని ఒత్తిడి కారణంగా టీమ్ఇండియా టీ20 సారథిగా తప్పుకోనున్నానని ప్రకటించి రూమర్లకు చెక్ పెట్టాడు విరాట్. కానీ, అతడి రాజీనామాకు (Virat Kohli Captaincy News) మించిన వ్యవహారం ఏదో జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి!
బీసీసీఐ వర్సెస్ కోహ్లీ?
ఇంగ్లాండ్ పర్యటన (England Tour of India) మొదలైన నాటి నుంచి వైట్బాల్ కెప్టెన్గా కోహ్లీని తొలగిస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. కోహ్లీ పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అసంతృప్తిగా ఉందని వార్తలు వచ్చాయి. వాటిని బీసీసీఐ (BCCI on Virat Kohli Captaincy) కోశాధికారి అరుణ్ ధుమాల్ కొట్టిపారేశారు. ఆ మరుసటి రోజే టీ20ల్లో కెప్టెన్గా తప్పుకొంటున్నట్లు కోహ్లీ ప్రకటించాడు. వచ్చే నెల టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2021) ముగిసిన తర్వాత పగ్గాలు వదిలేస్తానని అన్నాడు.
ఈ నిర్ణయం పట్ల అభిమానులు సహా క్రికెట్ మాజీలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే టీ20ల్లో మాత్రమే ఎందుకనే ప్రశ్నలూ వచ్చాయి. బీసీసీఐకి, కోహ్లీకి (BCCI VS Kohli) మధ్య చెడిందని కథనాలొచ్చాయి.
ఇదీ చూడండి:'కోహ్లీ ఒకటి చెబితే బీసీసీఐ మరొకటి చెబుతోంది'
ఈ నిర్ణయం ఇప్పుడే ఎందుకు?
కెప్టెన్సీ విషయమై 6 నెలలుగా చర్చలు జరుగుతున్నాయని, ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC Final) ఓటమి తర్వాత అవి తీవ్రతరం అయినట్లు తెలుస్తోంది. విరాట్ ప్రకటన తర్వాత బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా కొద్ది నెలలుగా ఈ విషయంపై చర్చిస్తున్నట్లు తెలిపారు.
అయితే మెగా టోర్నీకి (T20 World Cup 2021) ఒక నెల ముందే ఈ నిర్ణయాన్ని కోహ్లీ ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందని.. క్రికెట్ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
బీసీసీఐ తనను కెప్టెన్గా తొలగించనుందని కోహ్లీకి తెలిసిపోయిందా? పని ఒత్తిడి అసలు కారణమేనా? ఎంతో పవర్ఫుల్ క్రికెటర్గా ఉన్న విరాట్.. ఒక్కసారిగా తన ఆధిపత్యాన్ని ఎందుకు కోల్పోతున్నాడు?
ఇదీ చూడండి:Kohli Captaincy: కోహ్లీ నిర్ణయం వెనుక కారణాలేంటో?
కోహ్లీపై తిరుగుబావుటా?
మూడు ఫార్మాట్లలోనూ చాలాకాలంగా ఒక్క సెంచరీ (Virat Last Century) చేయకపోవడం విరాట్కు ప్రతికూలంగా మారింది. ఫామ్లేమి, నిర్ణయాలు తీసుకోవడంలో కోహ్లీ సామర్థ్యాన్ని ప్రభావితం చేసింది. అది ఇతర ప్లేయర్లతో సంబంధాలను దెబ్బతీసింది.
కోహ్లీ స్వభావం పట్ల పలువురు సీనియర్ ప్లేయర్లు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. వాస్తవానికి కొన్ని నెలల ముందే కోహ్లీపై జట్టులో తిరుగుబాటు మొదలైందని తెలుస్తోంది. విరాట్ తనను అభద్రతాభావానికి గురిచేశాడని ఓ సీనియర్ ప్లేయర్.. బీసీసీఐ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. అయితే న్యూజిలాండ్తో డబ్ల్యూటీసీ ఫైనల్లో (India vs New zealand WTC Final) సదరు ఆటగాడే ఏమాత్రం ఆసక్తి చూపలేదని కోహ్లీ ఆరోపించాడు.