Vijay Hazare Trophy Tamilnadu: విజయ్హజారే ట్రోఫీలో తమిళనాడు, హిమాచల్ప్రదేశ్ సెమీఫైనల్కు దూసుకెళ్లాయి. మంగళవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో తమిళనాడు 151 పరుగుల తేడాతో కర్ణాటకను చిత్తు చేసింది. మొదట తమిళనాడు 50 ఓవర్లలో 8 వికెట్లకు 354 పరుగుల స్కోరు చేసింది. ఓపెనర్ జగదీశన్ (102; 101 బంతుల్లో 9×4, 1×6) సెంచరీ సాధించాడు సాయికిశోర్ (61)తో కలిసి అతడు రెండో వికెట్కు 147 పరుగులు జోడించి ఇన్నింగ్స్కు గట్టి పునాది వేశాడు. చివర్లో దినేశ్ కార్తీక్ (44; 37 బంతుల్లో 4×4, 2×6)తో పాటు 7వ స్థానంలో వచ్చిన షారుక్ఖాన్ (79; 39 బంతుల్లో 7×4, 6×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టుకు భారీ స్కోరు అందించారు. కర్ణాటక బౌలర్లలో లెగ్స్పిన్నర్ ప్రవీణ్ దూబె (3/67), ప్రసిద్ధ్ కృష్ణ (2/57) రాణించారు. ఛేదనలో సిలంబరాశన్ (4/36), వాషింగ్టన్ సుందర్ (3/43) విజృంభించడం వల్ల కర్ణాటక 39 ఓవర్లలో 203 పరుగులకే ఆలౌటైంది. శ్రీనివాస్ శరత్ (43) టాప్ స్కోరర్.
యూపీకి షాకిచ్చి..