ఐపీఎల్ మిగిలిన మ్యాచ్లను యూఏఈలో జరపనున్నట్లు ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. అక్టోబర్ 17న టీ20 ప్రపంచకప్ మొదలవుతున్న కారణంగా వారం, పది రోజుల ముందే సీజన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే సెప్టెంబర్ మొదటి వారంలో లేదా ఆగస్టు చివరి వారంలో టోర్నీని ప్రారంభించాలి. ఇప్పటివరకు ఈ షెడ్యూల్పై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. ముందుగానే అన్ని ప్రణాళికల్ని రూపొందిస్తున్నాయి ఫ్రాంచైజీలు. అయితే ఇక్కడే ఒక చిక్కొచ్చి పడింది.
ఆటగాళ్లు ఉండేందుకు హోటల్స్, ప్రాక్టీస్ కోసం మైదానాలు వంటి పనుల కోసం ఫ్రాంచైజీలు ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే కొందరు అధికారులు ఈ విషయమై యూఏఈ వెళ్లాలని భావించారు. కానీ అక్కడి ప్రభుత్వం భారత్ నుంచి వచ్చే విమానాలపై జులై 21 వరకు నిషేధాన్ని పొడిగించింది. దీంతో అధికారులకు కొత్త చిక్కులు వచ్చాయి. ఈ విషయమై చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.