తెలంగాణ

telangana

భారత అండర్-19 కెప్టెన్ గా యశ్ ధుల్- జట్టు ఇదే..

By

Published : Dec 19, 2021, 7:36 PM IST

Updated : Dec 19, 2021, 7:41 PM IST

U19 World Cup 2021 India Squad: ఐసీసీ అండర్​-19 పురుషుల క్రికెట్​ వరల్డ్​ కప్​కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆటగాళ్ల జాబితాను పోస్టు చేసింది. యశ్ ధుల్​ను కెప్టెన్​గా ఎంపిక చేశారు.

U19 World Cup 2021 India Squad
అండర్​-19 క్రిెకెట్ జట్టు

U19 World Cup 2021 India Squad: వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభమవనున్న ఐసీసీ అండర్​-19 పురుషుల క్రికెట్​ వరల్డ్​ కప్​కు భారత జట్టు కూర్పు పూర్తయింది. ఆల్​ ఇండియా జూనియర్ సెలెక్షన్​ కమిటి ఈ మేరకు జట్టును ఎంపిక చేసింది. యశ్ ధుల్​ సారథ్యంలో ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ట్విట్టర్​లో పోస్టు చేసింది.

భారత జట్టు

వెస్టిండీస్​ వేదికగా 2022 జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు ఈ టోర్నీ జరగనుంది. 14వ సారి జరుగుతున్న ఈ టోర్నీలో 16 టీమ్​లు బరిలోకి దిగుతున్నాయి. ఇందులో భారత జట్టు టైటిల్​ ఫేవరెట్​గా నిలిచింది. 2000, 2008, 2012, 2018లో టైటిల్​ను సాధించింది. జనవరి 15న భారత జట్టు తొలి మ్యాచ్​లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

అండర్-19 జట్టు:యశ్ ధుల్ (కెప్టెన్​), ఎస్​కే రషీద్ (వైస్ కెప్టెన్), హర్నూర్ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, నిశాంత్ సింధు, సిద్దార్థ్ యాదవ్, దినేష్ బానా (కీపర్), ఆరాధ్య యాదవ్ (కీపర్), రాజ్ అంగద్ బావా, మానవ్ పరాఖ్, కౌశల్ తాంబే, ఆర్​ఎస్​ హంగర్గేకర్ , వాసు వాట్స్, విక్కీ ఓస్త్వాల్, రవికుమార్, గర్వ్ సంగ్వాన్.

స్టాండ్‌బై ప్లేయర్లు:రిషిత్ రెడ్డి, ఉదయ్ సహారన్, అన్ష్ గోసాయి, అమిత్ రాజ్ ఉపాధ్యాయ్, పీఎం సింగ్ రాథోడ్.

ఇదీ చదవండి:IND VS SA: 'దక్షిణాఫ్రికా టూర్​లో టీమ్​ఇండియా బలం వాళ్లే..'

Last Updated : Dec 19, 2021, 7:41 PM IST

ABOUT THE AUTHOR

...view details