తెలంగాణ

telangana

ETV Bharat / sports

పంత్​ కెప్టెన్సీకి సవాల్​.. రెండో టీ20లో భారత్​ బోణి కొడుతుందా?

దక్షిణాఫ్రికాతో తొలి టీ20లో ఓటమిని ఎదుర్కొన్న టీమ్​ఇండియా.. రెండో టీ20తో బోణి కొట్టాలని భావిస్తోంది. కేఎల్​ రాహుల్​ స్థానంలో కెప్టెన్సీ చేపట్టిన పంత్​కు తొలి మ్యాచ్​ ఫలితంతో రెండో టీ20 సవాల్​గా మారింది. భవిష్యత్‌లో జట్టు పగ్గాలు చేపట్టేందుకు పంత్‌కు ఈ సిరీస్‌ చాలా కీలకం కానుంది.

By

Published : Jun 11, 2022, 5:01 PM IST

పంత్
పంత్

దక్షిణాఫ్రికాతో 5 టీ-20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు రెండో టీ-20లో పుంజుకోవాలని భావిస్తోంది. ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌కు ఒడిశా కటక్‌లోని బారాబతి స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. తొలి టీ-20లో భారత బ్యాటర్లు భారీ స్కోరు సాధించినా... బౌలర్లు ధారాళంగా పరుగులు ఇవ్వడంతో పరాజయం తప్పలేదు. సీనియర్ పేసర్ భువనేశ్వర్‌, ఐరీఎల్​లో పర్పుల్ క్యాప్ గెలుచుకున్న చాహల్‌ సహా మిగితా బౌలర్లంతా విఫలం కావడంతో పర్యాటక జట్టు గెలుపు లాంఛనమైంది. తాత్కాలిక కెప్టెన్‌ రిషభ్​ పంత్‌ తొలి మ్యాచ్‌లో జట్టును గెలిపించలేకపోయాడు. దీంతో భారత జట్టు వరుస విజయాలకు బ్రేక్ పడింది. భవిష్యత్‌లో జట్టు పగ్గాలు చేపట్టేందుకు పంత్‌కు ఈ సిరీస్‌ చాలా కీలకం కానుంది.

బౌలింగ్ విభాగంలో రిజర్వ్‌ బెంచ్‌లో ఉన్న ఉమ్రన్‌ మాలిక్, అర్షదీప్‌ సింగ్‌లలో ఎవరో ఒకరు రెండో మ్యాచ్‌తో అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ విభాగంలో మార్పులేమీ లేకుండానే భారత్‌ బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌ చేజారితే సిరీస్‌ను గెలవాలంటే ఆ తర్వాతి 3 టీ-20ల్లోనూ తప్పక విజయం సాధించాల్సి ఉంటుంది. తొలి మ్యాచ్‌లో గెలిచి ఊపు మీద ఉన్న దక్షిణాఫ్రికా అదే జట్టుతో బరిలోకి దిగనుంది. ఆదివారం రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి :'చాలా కష్టపడ్డా.. పెద్ద యుద్ధమే చేశా.. ఇప్పుడు నేను హ్యాపీ'

ABOUT THE AUTHOR

...view details