తెలంగాణ

telangana

ETV Bharat / sports

మదర్స్​ డే సందర్భంగా క్రికెటర్ల శుభాకాంక్షలు

మదర్స్​ డే సందర్భంగా పలువురు క్రికెటర్లు తమ తల్లులకు శుభాకాంక్షలు తెలిపారు. దిగ్గజ క్రికెటర్​ సచిన్​తో పాటు సెహ్వాగ్​, రైనా, ధావన్.. సామాజిక మాధ్యమాల వేదికగా అభినందనలు చెప్పారు.

By

Published : May 9, 2021, 1:49 PM IST

sachin tedulkar, cricketers extend Mother's Day greetings
సచిన్ తెందుల్కర్, భారత బ్యాటింగ్ దిగ్గజం

మదర్స్​ డే సందర్భంగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్​తో పాటు పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్​ అమ్మపై ఓ పద్యం రాశాడు.

"తల్లులకు ఎంత వయసు వచ్చినప్పటికీ.. పిల్లల కోసం పరితపిస్తూనే ఉంటారు. నా జీవితంలో నాకు ఇద్దరు వ్యక్తులు తల్లులతో సమానం. వారిద్దరూ నన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తుంటారు. అయి, కాకు.. ఇద్దరికీ మదర్స్​ డే శుభాకాంక్షలు" అంటూ బ్యాటింగ్ దిగ్గజం ట్వీట్ చేశాడు. కొన్ని పాత ఫొటోలను షేర్​ చేశాడు.

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ సురేశ్​ రైనా.. మదర్స్ డే సందర్భంగా ట్విట్​ చేశాడు. "నన్ను సరైన మార్గంలో నడిపించిన అమ్మకి ధన్యవాదములు. అమ్మే నాకు అతిపెద్ద బలం.. ప్రేరణ. లవ్​ యూ అమ్మ. మదర్స్​ డే శుభాకాంక్షలు," అని ట్వీట్ చేశాడు.

భారత ఓపెనర్ ధావన్.. ఇన్​స్టాలో తన తల్లికి మదర్స్​ డే శుభాకాంక్షలు తెలిపాడు. "నా గురువు, మంచి స్నేహితురాలైన అమ్మకి మదర్స్​ డే శుభాకాంక్షలు" అని పోస్ట్​ పెట్టాడు.

ఇదీ చదవండి:'గిల్​ ప్రశాంతంగా ఉండు.. అన్నీ సర్దుకుంటాయ్'

ABOUT THE AUTHOR

...view details