తెలంగాణ

telangana

By

Published : Feb 27, 2023, 11:25 AM IST

Updated : Feb 27, 2023, 12:06 PM IST

ETV Bharat / sports

ముంబయి టీమ్​కు బిగ్​ షాక్​.. ఐపీఎల్​కు బుమ్రా దూరం.. WTC ఫైనల్​కూ అనుమానమే!

టీమ్​ఇండియా స్టార్​ బౌలర్​ జస్​ప్రీత్​ బుమ్రా ఐపీఎల్​ 2023 దూరం కానున్నాడట. ప్రపంచ టెస్ట్​ టోర్నీ ఫైనల్​కు కూడా బుమ్రా అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది.

team india ace pacer jasprit bumrah
team india ace pacer jasprit bumrah

మార్చి 31న ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్) 2023కు టీమ్ఇండియా స్టార్​ బౌలర్ జస్​ప్రీత్​ బుమ్రా దూరమైనట్లు తెలుస్తోంది. గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న బుమ్రా.. కోలుకోవడానికి ఇంకా సమయం పట్టే అవకాశముందని సమాచారం. అయితే ఈ స్టార్​ ప్లేయర్​ జూన్​లో జరగబోయే వరల్డ్​ టెస్టు ఛాంపియన్ షిప్​ ఫైనల్​కు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది.

గాయం కారణంగా ఐదు నెలలుగా జట్టుకు దూరంగా ఉన్న బుమ్రా ఎన్​సీఏలో రిహబిలిటేషన్​లో ఉన్నాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీకే ఈ ప్లేయర్​ అందుబాటులో ఉంటాడని భావించారు. మొదటి రెండు టెస్టులు ఆడకపోయినా.. ఆ తర్వాత ప్రకటించిన జట్టులో కూడా బుమ్రా పేరు రాలేదు. ఐపీఎల్​కైనా అందుబాటులోకి వస్తాడనుకంటే.. ఇప్పుడు అది కూడా సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అయితే, అనుకున్నదాని కంటే గాయం తీవ్రంగా ఉంది. దాని కారణంగానే బుమ్రా కోలుకోడానికి ఎక్కువ సమయం పడుతోందని సమాచారం. ఇక, బుమ్రా తాజా పరిస్థితి.. ముంబయి ఇండియన్స్​ జట్టుకు పెద్ద దెబ్బే అని చెప్పాలి. అయితే బుమ్రా స్థానంలో జొఫ్రా ఆర్చర్​ జట్టులోకి రావడం ముంబయి టీమ్​కు కాస్త ఉపశమనం కలిగించే విషయం.

బుమ్రా చివరగా గతేడాది సెప్టెంబర్​ 25న ఆసీస్​తో టీ20 మ్యాచ్​ ఆడాడు. ఆ తర్వాత టీ20 వరల్డ్​ కప్​నకు కూడా మిస్​ అయ్యాడు. బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీ తర్వాత ఆసీస్​తో జరగబోయే వన్డే సిరీస్​ కోసం బుమ్రాకు ఎన్​సీఏ క్లియరన్స్​ ఇవ్వలేదు. మెగా టోర్నీల నేపథ్యంలో బుమ్రా విషయంలో ఇప్పుడే తొందరపడొద్దని ఎన్​సీఏ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Last Updated : Feb 27, 2023, 12:06 PM IST

ABOUT THE AUTHOR

...view details