తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jan 14, 2024, 6:19 PM IST

ETV Bharat / sports

2024 టీమ్ఇండియా మేజర్ ఈవెంట్స్​- అందరి చూపు వీటిపైనే!

Team India 2024 Schedule: 2023 సంవత్సరాన్ని దిగ్విజయంగా ముగించిన టీమ్ఇండియా కొత్త ఏడాదిలో కీలక మ్యాచ్​లు ఆడనుంది. జట్టులో ప్రధాన ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ ఏడాది చాలా ముఖ్యం. ఆ విశేషాలంటో ఇక్కడ తెలుసుకుందాం.

Team India 2024 Schedule
Team India 2024 Schedule

Team India 2024 Schedule: 2023లో అన్ని ఫార్మట్లలో అగ్రస్థానంలో నిలిచిన టీమ్ఇండియా కొత్త ఏడాదిలో మూడు కీలక సిరీస్​లు ఆడనుంది. గత ఏడాది ద్వైపాక్షిక సిరీస్​లతోపాటు ఆసియా కప్ గెలుచుకున్న టీమ్​ఇండియా వన్డే ప్రపంచకప్​ను మాత్రం మిస్ అయింది. ప్రపంచకప్ మ్యాచ్​ల్లో ఆరంభం నుంచి అదిరిపోయే ప్రదర్శనతో ఫైనల్స్​కు దూసుకొచ్చినా, తుదిపోరులో పరాజయం చవిచూసింది.

అయితే ఈ ఏడాది టీమ్ఇండియా ప్రధానంగా మూడు సిరీస్​ల్లో ఆడనుంది. ఈ సిరీస్​ల్లో టీమ్ఇండియా ప్రదర్శనపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గత ఏడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ ఏడాది ఈ ఇద్దరు టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పొట్టి క్రికెట్ టోర్నీలో వీరి ప్రదర్శనపై ఆసక్తి పెరుగుతోంది. ఇక టెస్టు క్రికెట్​లో టీమ్ఇండియా ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే స్థానాన్ని శుభ్​మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ భర్తీ చేస్తున్నారు. మరి ఈ ఏడాది ప్రధానంగా జరిగే మూడు సిరీస్​లు ఏంటంటే?

భారత్- ఇంగ్లాండ్ టెస్టు సిరీస్
బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు ఐదు టెస్టు మ్యాచ్​ల సిరీస్​ కోసం భారత్​కు రానుంది. జనవరి 25 నుంచి మార్చి 27 వరకు ఈ సిరీస్ జరగనుంది. గత ఏడాదిన్నరగా స్టోక్స్ నాయకత్వంలో తిరుగులేని విజయాలు సాధిస్తున్న ఇంగ్లాండ్​ను, రోహిత్ కెప్టెన్సీలో భారత్ తొలిసారి ఢీకొట్టనుంది. స్పిన్​కు అనుకూలించే పిచ్​పై ఇంగ్లాండ్ జట్టు ఏ మేరకు రాణిస్తుంది? యువ ప్లేయర్లతో కూడిన టీమ్ఇండియా ఎలా ఆడనుందని సర్వత్రా ఆసక్తి కలుగుతోంది.

2024 టీ20 వరల్డ్​కప్
వెస్టిండీస్, అమెరికా సంయుక్త వేదికలుగా 2024 టీ20 వరల్డ్​కప్ జరగనుంది. ఈ టోర్నీ జూన్ 5న ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి భారత్ జట్టు ఎలా ఉండనుంది? టీమ్ఇండియాకు నాయకత్వం వహించేదెవరు? ఇలా అనేక ప్రశ్నలు ఫ్యాన్స్​ మదిలో ఉన్నాయి. అయితే గత 13 ఏళ్లుగా ఐసీసీ ట్రోఫీ కల ఇప్పుడైనా తీరాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి జరగనుందో!

కెప్టెన్సీ సందిగ్ధత
2022 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి తర్వాత భారత టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక టీ20 వరల్డ్​కప్ మ్యాచ్​కు అందుబాటులో ఉంటానని రోహిత్ స్పష్టం చేసినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ, ఈ విషయంపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్​మెంట్ లేదు. రోహిత్ శర్మ తర్వాత జట్టుకు నాయకత్వం వహించే స్థాయిలో ఉన్న హార్ధిక్ పాండ్య గాయంతో వరల్డ్ కప్​నకు దూరమయ్యాడు. దీంతో టీ20 వరల్డ్​కప్​లో టీమ్ఇండియాను ఎవరు నడిపిస్తారన్నది ఆసక్తిగా మారింది.

బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024/25
ఐదు టెస్టు మ్యాచ్​ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా వెళ్లనుంది. గతంలో విరాట్ కెప్టెన్సీలో 2018-19, రహానే నాయకత్వంలో 2020-21 బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భారత్ విజయం సాధించింది. ఇక తొలిసారి రోహిత్ నాయకత్వంలో భారత్ గావస్కర్ ట్రోఫీ ఆడనుంది. అటు రోహిత్​ కూడా భారత్​కు బోర్డర్ గావస్కర్ ట్రోఫీ అందించిన కెప్టెన్ల లిస్ట్​లో చేరాలనుకుంటున్నాడు.

2024 రంజీలో బ్యాటర్లు అదరహో- అందరి టార్గెట్ అదే!

పొట్టి కప్, ఎన్నో సిరీస్​లు- 2024లో ఫుల్ మజా- భారత్ పూర్తి షెడ్యూల్ ఇదే!

ABOUT THE AUTHOR

...view details