క్రికెటర్ రషీద్కు తెదేపా నేతల సన్మానం Felicitation to Cricketer Rasheed: భవిష్యత్తులో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించటమే తన లక్ష్యమని.. అండర్ -19 భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ రషీద్ అన్నారు. ఇటీవల అండర్ 19 ప్రపంచకప్లో అద్భుతమైన ప్రతిభ చూపిన రషీద్ను.. గుంటూరులో తెదేపా నాయకులు సన్మానించారు.
గుంటూరు జిల్లాలోని ఓ పల్లెటూర్లో పుట్టి పెరిగి.. క్రికెట్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించిన రషీద్ ప్రతిభను అందరూ కొనియాడారు. తల్లిదండ్రులు, కోచ్ సహకారం వల్లే.. గొప్పగా ఆడగలుగుతున్నానని ఈ యువ క్రికెటర్ తెలిపారు.
ఇదీ చదవండి :Under-19 World Cup 2022 : అండర్-19 వరల్డ్ కప్లో సత్తా చాటిన.. తెలుగు కుర్రాడు!