తెలంగాణ

telangana

By

Published : Sep 11, 2021, 9:52 PM IST

ETV Bharat / sports

Ind vs Eng: 'భారత్ చివరి టెస్టు ఆడకపోవడానికి కారణమదే'

ఇంగ్లాండ్​తో జరగాల్సిన ఆఖరి టెస్టు రద్దు కావడంపై టీమ్​ఇండియా (ind vs eng) సహా ఐపీఎల్​ను నిందిస్తున్నారు ఆ దేశ మాజీ క్రికెటర్లు. ఐపీఎల్​లో లభించే డబ్బు కోసమే క్రికెటర్లు ఈ మ్యాచ్​కు సుముఖంగా లేరని స్టీవ్ హర్మిన్​సన్ విమర్శించాడు. ఐపీఎల్​ విషయంలో భారత్ ఎట్టిపరిస్థితుల్లో రాజీ పడదని అన్నాడు ఇంగ్లాండ్ మాజీ సారథి నాసిర్ హుస్సేన్.

ind vs eng
ఐపీఎల్

టీమ్​ఇండియా-ఇంగ్లాండ్ ఐదో టెస్టు రద్దు కావడం పలువురు మాజీలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఐపీఎల్​, ఈ మ్యాచ్​ రద్దుకు (ind vs eng) కారణమని ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్టీవ్ హర్మిన్​సన్ ఆరోపించాడు. టెస్టు ఆడేందుకు టీమ్​ఇండియా క్రికెటర్ల విముఖత కూడా మరో కారణమని అన్నాడు. సిరీస్​ మధ్యలో కరోనా సోకితే, అనుకున్నదానికంటే సమయం క్వారంటైన్​లో ఉండాల్సి వస్తుందన్న భయం.. ఎక్కువ డబ్బులు సంపాదించుకునే వీలున్న టోర్నీ​లోని కొన్ని మ్యాచ్​లను కోల్పోతామనే ఆందోళనతో ఐదో టెస్టు ఆడేందుకు అయిష్టత చూపారని పేర్కొన్నాడు.

సహాయక సిబ్బందిలో నలుగురికి కరోనా సోకడం సహా ఆఖరి టెస్టుకు ముందుకు ఫిజియో యోగేశ్​ పర్మార్​కు పాజిటివ్​గా తేలడం వల్ల టీమ్​ఇండియా క్రికెటర్లలో నెలకొన్న ఆందోళన కారణంగా టాస్​కు కొన్ని గంటల ముందు ఓల్డ్​ ట్రాఫోర్డ్​లో మ్యాచ్​ రద్దు అయ్యింది. సిరీస్​లో 2-1తో ఆధిక్యంలో ఉన్న ఇండియా.. మ్యాచ్​ను వదిలేసుకుందని తొలుత ఇంగ్లాండ్, వేల్స్​ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. కాసేపటికే జట్టును బరిలోకి దింపలేకపోతోందని తన వ్యాఖ్యలను సవరించుకుంది. అయితే ఈసీబీ ప్రకటనను కొట్టిపారేశాడు హర్మిన్​సన్.

పనికిమాలిన చర్య..

"ఇది నిజంగా పనికిమాలిన చర్య. నా దృష్టిలో టెస్టు క్రికెట్ అంతానికి ఇది ఆరంభం. దీనికి కారణం.. ఐపీఎల్. మరో 5 రోజుల్లో ఆ లీగ్​​ ప్రారంభం కానుంది. పర్యటనకు నెల ముందుగానే ఐపీఎల్​ కోసం టెస్టును ముందుకు జరపాలని టీమ్​ఇండియా అడిగింది. ఇప్పుడు ఒక్కసారిగా ఇలా మ్యాచ్​ రద్దవడం సరికాదు. డబ్బు చుట్టే ప్రపంచం తిరుగుతుంది. కానీ నిజాయతీ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఎలా అంటే.. నా బ్యాటు, నా బాల్​... నాకు నచ్చితేనే ఆడతా అని ఇండియా దబాయిస్తున్నట్లుంది"

-హర్మిన్​సన్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్

ఐపీఎల్​ విషయంలో రాజీలేదు..

కిక్కిరిసిన షెడ్యూల్, ఐపీఎల్​ లాంటి 'తప్పించలేని టోర్నీ' కారణంగా ఐదో టెస్టు రద్దు అయ్యిందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ చెప్పాడు. ఐపీఎల్​ విషయంలో టీమ్​ఇండియా ఎట్టి పరిస్థితుల్లో రాజీపడదని అన్నాడు.

"భారత్​కు సంబంధించినంత వరకు ఐపీఎల్ జరగాల్సిందే. ఎందుకంటే అక్కడ ఉన్న డబ్బు అలాంటిది. కానీ, ఇలా ఓ మ్యాచ్​ నుంచి అర్ధాంతరంగా తప్పుకుంటే అభిమానులకు విషాదమే మిగిలుతుంది."

-నాసిర్ హుస్సేన్, ఇంగ్లాండ్ మాజీ సారథి

అయితే ఈ పరిస్థితికి క్రికెటర్లను నిందించడం సరికాదని హుస్సేన్ అన్నాడు. వైరస్, కుటుంబానికి దూరంగా క్వారంటైన్​ లాంటి​ భయాలను తోసిపుచ్చలేమని చెప్పాడు. మాంచెస్టర్ టెస్టును రీషెడ్యూల్ చేయడానికి ఇంగ్లాండ్​ ప్రతినిధులతో చర్చించేందుకు సెప్టెంబర్​ 22న యూకే వెళ్లనున్నారుబీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ.

ఇవీ చూడండి:IPL 2021: ఐపీఎల్​ నుంచి తప్పుకున్న ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్లు

ABOUT THE AUTHOR

...view details