ఇంగ్లాండ్ పర్యటనకు టీమ్ఇండియా మహిళా ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్న వారు తమ సమయాన్ని కొంచెం కూడా వృథా చేయడం లేదు. దేహధారుడ్యాన్ని పెంచుకుంటూ ఫిట్గా ఉండేందుకు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. జిమ్లో వర్కౌట్స్ చేస్తూ చెమటలు చిందిస్తున్నారు. తాజాగా ఆ వర్కౌట్స్కు సంబంధించిన వీడియో బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్లో గురువారం పోస్టు చేసింది. 'షట్ ది నాయిస్' అని వ్యాఖ్య రాసుకొచ్చింది.
చెమటోడ్చుతున్న టీమ్ఇండియా మహిళా క్రికెటర్స్
ఇంగ్లాండ్ సిరీస్ కోసం టీమ్ఇండియా మహిళా ఆటగాళ్లు జిమ్లో చెమటలు చిందిస్తున్నారు. ఫిట్నెస్ పెంచుకునేందుకు వర్కౌట్స్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.
టీమ్ఇండియా మహిళా క్రికెటర్స్
ఈ వీడియోలో సారథి మిథాలీ రాజ్, హర్మన్ప్రీత్ కౌర్, షెఫాలీ వర్మ, రాధా యదవ్, పూనమ్ యాదవ్, దీప్తి శర్మ తదితరులు వర్కౌట్స్ చేస్తూ చెమటోడ్చుతున్నారు. ఈ పర్యటనలో టీమ్ఇండియా ఓ టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్ జూన్ 16 నుంచి ప్రారంభంకానుంది.