టీమ్ఇండియా వన్డే జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య.. ఐపీఎల్ల్లో గుజరాత్ టైటాన్స్కు సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2022లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ టీమ్కు హార్దిక్ కెప్టెన్గా వ్యవహరించడంతో పాటు ఈ టీమ్ను తమ ఫస్ట్ సీజన్లోనే ఛాంపియన్గా అవతరించేలా చేశాడు. అయితే గుజరాత్ కన్నా ముందు ముంబయి ఇండియన్స్లో కీలకంగా ఉన్న పార్దిక్.. కెప్టెన్సీ ఆఫర్ రావడంతో గుజరాత్కు షిఫ్ట్ అయిపోయాడు. అలాగే కోల్కతా నైట్ రైడర్స్లో మంచి ప్రదర్శన చేస్తున్న శుభమన్ గిల్ కూడా గుజరాత్కు మారిపోయాడు. వీరిద్దరితో పాటు సన్రైజర్స్ ప్లేయర్ రషీద్ ఖాన్ కూడా ఇదే జట్టుకు వెళ్లిపోయాడు. అలా ఈ ముగ్గురు ప్లేయర్స్ మంచిగా రాణించడంతో ఐపీఎల్ 2022 ఛాంపియన్గా నిలిచింది గుజరాత్ జట్టు. మరి కొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ 2023లోనూ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న ఈ టీమ్.. ఈ సారి కూడా విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు టీమ్ఇండియాలోనూ కెప్టెన్ రోహిత్ వారసుడిగా హార్దిక్ పేరునే చెప్పుకుంటున్నారు.
అయితే ఇప్పుడు.. త్వరలోనే హార్దిక్కు గుజరాత్ షాకివ్వబోతుందా? కెప్టెన్గా శుభ్మన్ గిల్ను నియమించనుందా? అంటే.. భవిష్యత్లో ఇదే జరగొచ్చని మాటలు వినిపించాయి. ఈ వ్యాఖ్యలు అన్నది మరెవరో కాదు గుజరాత్ టైటాన్స్ టీమ్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి. ఆయన తాజా వ్యాఖ్యలు.. గుజరాత్ కెప్టెన్సీ మార్పు చర్చకు దారీ తీసింది. ఆయన మాట్లాడుతూ.. "గిల్లో నాయకత్వ లక్షణాలు బాగా ఉన్నాయి. అతడు టాలెంట్ ప్లేయర్ సమీప భవిష్యత్లో అతడు మా కెప్టెన్గా ఎదుగుతాడు. టీమ్ మీటింగ్స్లో అతడిని ఆహ్వానించడంతో పాటు అతడి అభిప్రాయాలకు విలువిస్తున్నాం. కానీ అతడిని కెప్టెన్ చేసే విషయమై మేం ఏం నిర్ణయం తీసుకోలేదు" అని చెప్పారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్మీడియాలో హాట్టాపిక్గా మారింది. కానీ నిజానికి సోలంకి.. హార్దిక్ను కెప్టెన్సీ నుంచి తొలిగిస్తామని చెప్పలేదు. భవిష్యత్లో అతడు సారథి అయ్యే లక్షణాలు ఉన్నాయని అన్నారు.