Shreyas Iyer VVS Laxman: న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో టీమ్ఇండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ను మాజీ బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ 'స్టాండ్ ఔట్ ప్లేయర్'గా అభివర్ణించాడు. కాన్పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో అయ్యర్ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతడు తొలి మ్యాచ్లోనే శతకం, అర్ధశతకం బాది.. ఈ అరుదైన ఘనత సాధించిన తొలి భారత బ్యాట్స్మన్గా రికార్డులకెక్కాడు. తాజాగా అతడి ఆటతీరును మెచ్చుకుంటూ లక్ష్మణ్ ఓ క్రీడాఛానెల్తో మాట్లాడాడు.
"ఈ సిరీస్లో శ్రేయస్ స్టాండ్ ఔట్ ప్లేయర్గా నిలిచాడు. తన తొలి టెస్టులోనే ఒత్తిడిని జయిస్తూ రాణించిన తీరు అద్భుతం. తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు పడిన క్లిష్టపరిస్థితుల్లో బ్యాటింగ్కు వచ్చిన అతడు.. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొని బ్యాటింగ్ చేశాడు. తర్వాత శతకం సాధించాడు. ఇక టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్లోనూ పీకల్లోతు కష్టాల్లో ఉండగా క్రీజులోకి వచ్చాడు. 51 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఒత్తిడిలో శ్రేయస్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడాడు. అర్ధ శతకం సాధించాడు. దీంతో రెండు ఇన్నింగ్స్ల్లోనూ అతడు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు"
-వీవీఎస్ లక్ష్మణ్, మాజీ బ్యాట్స్మెన్