తెలంగాణ

telangana

షకీబ్​ పోరాటంతో బంగ్లా గెలుపు.. పాక్​పై ఇంగ్లాండ్ ప్రతీకారం

By

Published : Jul 19, 2021, 10:12 AM IST

జింబాబ్వేతో మ్యాచ్​లో బంగ్లాదేశ్​ అతికష్టం మీద గెలిచింది. మరోవైపు పాకిస్థాన్​పై రెండో టీ20లో గెలిచిన ఇంగ్లాండ్​, తొలి మ్యాచ్​ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.

shakib
షకీబ్​

స్టార్​ ఆల్​రౌండర్​ షకీబ్​ అల్​ హాసన్​(96*) విరోచిత పోరాటంతో జింబాబ్వేతో రెండో వన్డేలో బంగ్లాదేశ్​ గెలిచింది. మూడు వికెట్లు తేడాతో మ్యాచ్​లో విజయం సాధించి, మూడు మ్యాచ్​ల సిరీస్​ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన పోరులో మొదట బ్యాటింగ్​ చేసిన జింబాబ్వే నిర్ణీత 50ఓవర్లలో 240/9 పరుగులు చేసింది. మధెవెరె(56), సారథి బ్రెండన్​ టేలర్​(46) తప్ప మిగతావారు రాణించలేకపోయారు. బంగ్లా బౌలర్లలో షోరీఫుల్​ ఇస్లామ్ 4, షకీబ్​ 2, తస్కిన్​ అహ్మద్​, సైఫుద్దీన్​, మెహదీ హాసన్​ తలో వికెట్​ తీశారు.

అనంతరం ఛేదనలో బంగ్లా తడబడింది. 145 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలోనే షకీబ్ టెయిలెండర్ల సహకారంతో జింబాబ్వేపై ఎదురుదాడికి దిగి జట్టుకు విజయాన్ని అందించాడు. మొత్తంగా 49.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది బంగ్లా.

పాక్​ జట్టుపై ఇంగ్లాండ్​ గెలుపు

పాకిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ పుంజుకుంది. తొలి మ్యాచ్‌లో ఓడిన ఆ జట్టు.. ఆదివారం రెండో టీ20లో 45 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. బట్లర్‌ (59; 39 బంతుల్లో 7×4, 2×6), మొయిన్‌ అలీ (36; 16 బంతుల్లో 6×4, 1×6), లివింగ్‌స్టన్‌ (38; 23 బంతుల్లో 2×4, 3×6) మెరుపులతో 200 పరుగులకు ఆలౌటైంది. పాక్‌ బౌలర్లలో హస్నైన్‌ 3 వికెట్లు, ఇమాద్‌ వసీమ్‌, హారిస్‌ రవూఫ్‌ తలో 2 వికెట్లు తీశారు.

అనంతరం షకీబ్‌ మహ్మద్‌ (3/33), మొయిన్‌ అలీ (2/32), అదిల్‌ రషీద్‌ (2/30) ధాటికి పాక్‌ 155/9 పరుగులే చేయగలిగింది. రిజ్వాన్‌ (37), షాదాబ్‌ ఖాన్‌ (36 నాటౌట్‌) మాత్రమే రాణించారు.

ఇదీ చూడండి:ధావన్​ రికార్డ్​​.. రాణించిన ఇషాన్​.. భారత్​ ఘన విజయం

ABOUT THE AUTHOR

...view details