తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్ఇండియా ఓటమిపై మైక్రోసాఫ్ట్​ సీఈఓ స్పందన- సత్య నాదెళ్ల ఏమన్నారంటే? - వరల్డ్​ కప్ 2023 సత్య నాదేళ్ల

Satya Nadella On India World Cup Loss : వరల్డ్​ కప్​ ఫైనల్​లో టీమ్​​ఇండియా ఓటమిపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?

Satya Nadella On India World Cup Loss
Satya Nadella On India World Cup Loss

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2023, 6:13 PM IST

Updated : Nov 21, 2023, 9:53 PM IST

Satya Nadella On India World Cup Loss: ఆదివారం జరిగిన 2023 వరల్డ్​ కప్​ ఫైనల్​ మ్యాచ్​పై టెక్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందించారు. ఓ పాడ్​కాస్ట్​లో సత్య నాదెళ్ల మాట్లాడుతుండగా.. షో హోస్ట్​ వరల్డ్‌ కప్‌ గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత టీమ్ఇండియా ఓటమిని గుర్తుచేసి.. ఆ ఓటమికి ప్రతీకారంగా 'ఆస్ట్రేలియాను కొంటారా?' అని సరదాగా ప్రశ్నించారు. దీనిపై సత్య నాదెళ్ల స్పందించారు. ఆస్ట్రేలియాను కొనడం అంటే ఓపెన్‌ఏ ఐను సొంతం చేసుకోవడం లాంటిదేనని.. ఆ రెండూ సాధ్యం కావని నవ్వుతూ బదులిచ్చారు. కానీ, ఓపెన్‌ ఏఐతో తాము భాగస్వాములం కాగలమని అన్నారు. అలాగే ఆస్ట్రేలియా క్రికెట్‌ ఆడడాన్నీ ఆనందించగలమని అని సరదాగా బదులిచ్చారు.

అయితే సత్య నాదెళ్ల క్రికెట్‌ అభిమాని. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ఆయనే స్వయంగా వ్యక్తం చేశారు. 2023 వరల్డ్​ కప్​లో భాగంగా గత బుధవారం న్యూజిలాండ్‌, భారత్‌ మధ్య జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ను రాత్రంతా మేల్కొని మరీ చూసినట్లు తెలిపారు.

అయితే వరల్డ్​ కప్​ ఫైనల్‌ మ్యాచ్‌ను సైతం సత్య నాదెళ్ల వీక్షించారు. ఆస్ట్రేలియా విజయం ఖరారు కాగానే సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​ ఎక్స్‌ వేదికగా ఆ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో ఎంతో శ్రమించి అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత జట్టును కూడా అభినందించారు. క్రికెట్‌ గురించి పలు సందర్భాల్లో నాదెళ్ల గతంలో ప్రస్తావించారు. ఈ ఆటే తనకు టీమ్​లో కలిసి పనిచేయడాన్ని, నాయకత్వాన్ని నేర్పించిందని మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా నియమితులైన సమయంలో చెప్పారు.

ఆదివారం జరిగిన 2023 వరల్డ్​ కప్​ ఫైనల్​లో ఆసీస్​ చేతిలో టీమ్ఇండియా ఓటమిపాలైంది. దీంతో ఆస్ట్రేలియా ఆరో సారి విశ్వవిజేతగా నిలిచింది. అయితే, ఓటమి తర్వాత టీమ్ఇండియా ప్లేయర్లతో పాటు యావత్​ దేశం తీవ్ర మనస్తాపానికి గురైంది. బాధలో ఉన్న ప్లేయర్లను డ్రెస్సింగ్​లోకి వెళ్లి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓదార్చారు. కొన్ని సార్లు ఇలా జరుగుతుందని వారిలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.

పెళ్లిపీటలెక్కనున్న టీమ్​ఇండియా ప్లేయర్ వెంకటేశ్​ అయ్యర్-​ ఎంగేజ్​మెంట్ ఫొటోలు చూశారా?

క్రికెట్​లో మరో కొత్త రూల్!​- శ్రీలంక నుంచి అండర్​ 19 వరల్డ్ కప్ ఔట్​- కీలక నిర్ణయాలు తీసుకున్న ఐసీసీ

Last Updated : Nov 21, 2023, 9:53 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details