తెలంగాణ

telangana

ETV Bharat / sports

దేశవాళీ క్రికెట్లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం - సతీష్ రాజగోపాల్ క్రికెట్

Satish Rajagopal News: దేశవాళీ క్రికెట్​లో స్పాట్ ఫిక్సింగ్​ అంశం మరోసారి వెలుగుచూసింది. త్వరలో తమిళనాడు ప్రీమియర్​ లీగ్ జరగనున్న​ నేపథ్యంలో క్రికెటర్​ సతీష్​ రాజగోపాల్​ను​ ఫిక్సింగ్​కు పాల్పడాలంటూ ఓ వ్యక్తి డబ్బు ఆఫర్​ చేసినట్లు తెలిసింది.

satish rajagopal
సతీష్ రాజగోపాల్

By

Published : Jan 16, 2022, 4:12 PM IST

Satish Rajagopal News: దేశవాళీ క్రికెట్లో మరోసారి స్పాట్ ఫిక్సింగ్ అంశం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తిపై బెంగళూరు జయనగర పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది.

దేశవాళీ క్రికెటర్ సతీష్ రాజగోపాల్

ఇదీ జరిగింది..

తమిళనాడు ఆల్​రౌండర్ సతీష్​ రాజగోపాల్​కు బన్నీ ఆనంద్ అనే వ్యక్తి స్పాట్ ఫిక్సింగ్​కు పాల్పడాలని కొంత డబ్బు ఆఫర్​ చేసినట్లు తెలిసింది. లోకేష్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు.

"జనవరి 3న బన్నీ ఆనంద్ తన ఇన్​స్టాగ్రామ్​ ఖాతా నుంచి సతీష్ రాజగోపాల్​కు కొంత డబ్బు ఆఫర్​ చేశాడు. స్పాట్ ఫిక్సింగ్​కు పాల్పడాలని కోరాడు. తమిళనాడు ప్రీమియర్​ లీగ్​ నేపథ్యంలో ఇద్దరు ఆటగాళ్లు స్పాట్​ ఫిక్సింగ్​కు పాల్పడేందుకు సిద్ధంగా ఉన్నారని రాజగోపాల్​కు చెప్పాడు. ఒక్కో మ్యాచ్​కు రూ. 40 లక్షలు ఇస్తామని సతీష్​కు ఆఫర్​ ప్రకటించాడు" అని లోకేష్​ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

సతీష్ రాజగోపాల్

కాగా, ఈ ఆఫర్​ను తిరస్కరించిన సతీష్​ కూడా.. బీసీసీఐ అవినీతి నిరోధక విభాగానికి ఫిర్యాదు చేశాడు.

ఇదీ చదవండి:

అది కోహ్లీ వ్యక్తిగత నిర్ణయమే..: గంగూలీ

Team india: టీమ్​ఇండియా బోణీ.. దక్షిణాఫ్రికాపై ఘనవిజయం

ABOUT THE AUTHOR

...view details