Satish Rajagopal News: దేశవాళీ క్రికెట్లో మరోసారి స్పాట్ ఫిక్సింగ్ అంశం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తిపై బెంగళూరు జయనగర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఇదీ జరిగింది..
తమిళనాడు ఆల్రౌండర్ సతీష్ రాజగోపాల్కు బన్నీ ఆనంద్ అనే వ్యక్తి స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడాలని కొంత డబ్బు ఆఫర్ చేసినట్లు తెలిసింది. లోకేష్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు.
"జనవరి 3న బన్నీ ఆనంద్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి సతీష్ రాజగోపాల్కు కొంత డబ్బు ఆఫర్ చేశాడు. స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడాలని కోరాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ నేపథ్యంలో ఇద్దరు ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడేందుకు సిద్ధంగా ఉన్నారని రాజగోపాల్కు చెప్పాడు. ఒక్కో మ్యాచ్కు రూ. 40 లక్షలు ఇస్తామని సతీష్కు ఆఫర్ ప్రకటించాడు" అని లోకేష్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.