తెలంగాణ

telangana

IND VS SL: రోహిత్‌ హాఫ్‌ సెంచరీని ఎవరికి అంకితం ఇచ్చాడో తెలుసా?

By

Published : Jan 10, 2023, 8:05 PM IST

శ్రీలం‍కతో జరుగుతున్న తొలి వన్డేలో టీమ్​ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సెంచరీ చేరువగా వచ్చి పెవిలియన్​ చేరిన సంగతి తెలిసిందే. అయితే అతడు హాఫ్​ సెంచరీ బాదాక ఆకాశం వైపు చూస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. తన అర్ధ శతకాన్ని ఒకరికి అంకితమిచ్చాడు. ఎవరంటే?

Rohithsharma half century srilanla series
IND VS SL: రోహిత్‌ హాఫ్‌ సెంచరీని ఎవరికి అంకితం ఇచ్చాడో తెలుసా?

శ్రీలం‍కతో జరుగుతున్న తొలి వన్డేలో టీమ్​ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మెరుపు హాఫ్‌ సెంచరీతో చేశాడు. ఈ ఏడాదిని గొప్పగా ఆరంభించాడు. అయితే తృటిలో సెంచరీని మిస్​ చేసుకున్నాడు. చాలాకాలం తర్వాత మునపటి టచ్‌లో కనబడిన హిట్‌ మ్యాన్‌ 41 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఓవరాల్‌గా 67 బంతులు ఎదుర్కొన్న అతడు 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన రోహిత్‌ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మధుశంక బౌలింగ్‌లో బంతి ఇన్‌ సైడ్‌ ఎడ్జ్‌ తీసుకోవడంతో రోహిత్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో రోహిత్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాక ఆకాశం వైపు చూస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. ఎందుకంటే.. జనవరి 9 రోహిత్‌ ముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్క మ్యాజిక్‌ కన్నుమూసింది. ఈ విషయాన్ని రోహిత్‌ భార్య రితిక తన ఇన్‌స్టా ద్వారా తెలిపింది. మ్యాజిక్‌ లేదన్న బాధలోనే ఈ మ్యాచ్‌ బరిలోకి దిగిన రోహిత్‌ హాఫ్​సెంచరీ పూర్తి కాగానే ఆకాశం వైపు చూస్తూ మ్యాజిక్‌ పేరును స్మరించాడు. హాఫ్‌ సెంచరీని మ్యాజిక్‌కు అంకితమిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్​ అవుతోంది.

ఇదీ చూడండి:IND VS SL: కోహ్లీ సెంచరీ.. అతడు చెప్పినట్టే జరిగిందిగా!

ABOUT THE AUTHOR

...view details