తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రోహిత్​కు ఇదే లాస్ట్​ వరల్డ్​కప్​​- విరాట్​ ఆ రికార్డు బ్రేక్​ చేయడం ఖాయం!' - రోహిత్​​ కెరీర్​పై కోచ్​ దినేశ్​ లాడ్​ కామెంట్స్​

Rohit Sharma Last World Cup : టీమ్​ఇండియా సారథి రోహిత్​ శర్మ, పరుగులు వీరుడు విరాట్​ కోహ్లిపై పలు ఆసక్తికర కామెంట్స్​ చేశాడు హిట్​మ్యాన్​ వ్యక్తిగత కోచ్‌ దినేశ్‌ లాడ్‌. ఇంతకీ ఏమన్నాడంటే..

Rohit Sharma Last World Cup Virat 50th ODI Century
Rohit Sharma Last World Cup Coach Dinesh Lad Comments

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2023, 6:01 PM IST

Rohit Sharma Last World Cup :టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మ, కింగ్​ విరాట్​ కోహ్లిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రోహిత్​ వ్యక్తిగత కోచ్​ దినేశ్​ లాడ్​. ఓ ఇంటర్వ్యూలో రోహిత్‌ వయసు, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత్​కు ఉన్న విజయావకాశాలపై మాట్లాడాడు. 'రోహిత్​కు ఈ వరల్డ్​కప్పే చివరిది కావచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అతడి వయసు 36 ఏళ్లు. మళ్లీ వచ్చే ప్రపంచకప్​ నాటికి అతడికి 40 సంవత్సరాలు నిండుతాయి. టీమ్​ఇండియా ఆటగాళ్లు ఆ వయసులో అంతర్జాతీయ టోర్నీలు ఆడతారని మాత్రం నేను అనుకోవట్లేదు. ఈ విషయం రోహిత్​కు కూడా తెలుసు. అందుకని ఈసారి ఎలాగైనా దేశం కోసం ప్రపంచకప్​ను ముద్దాడాలని హిట్​మ్యాన్​ ఉవ్విళ్లూరుతున్నాడు' అని దినేశ్​ లాండ్. మరోవైపు కోహ్లి ఆటతీరుపై కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు లాడ్. 'ప్రస్తుతం విరాట్​ దూకుడు చూస్తుంటే.. ఇదే వరల్డ్​కప్​లో అతడు తన 50వ వన్డే సెంచరీని పూర్తి చేస్తాడేమో అనిపిస్తోంది' అని చెప్పాడు.

అటు సెంచరీలు.. ఇటు వికెట్లు..
ఈ టోర్నీలో టీమ్​ఇండియా జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో భీకరమైన ఫామ్​ను కొనసాగిస్తోంది. అటు బ్యాటర్లు సెంచరీలు, హాఫ్​ సెంచరీలతో చెలరేగుతుంటే.. ఇటు బౌలర్లు సైతం తగ్గేదేలే అంటూ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. టాప్​ ఆర్డర్​లో ఉన్న 5 బ్యాటర్లలో ఇప్పటికే నలుగురు సెంచరీలు కూడా బాదారు. ఈ మెగా పోరులోనే విరాట్​ 2 సెంచరీలు బాది తన 49వ వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా రోహిత్‌, శ్రేయస్‌, రాహుల్‌ సైతం తలో సెంచరీ నమోదు చేశారు. శుభ్‌మన్‌ గిల్‌ సైతం 3 హాఫ్​ సెంచరీలు బాది ఆకట్టుకుంటున్నాడు. ఇక రాణించాల్సిందల్లా సూర్యకుమార్‌ యాదవ్​ ఒక్కడే.

బౌలింగ్​లో భళా..
ప్రత్యర్థ బ్యాటర్లకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు టీమ్​ఇండియా పేస్​ త్రయం. అద్భుతమైన బౌలింగ్​ షాట్స్​తో ప్రత్యర్థి జట్లను మట్టికరిపిస్తున్నారు. జస్ప్రీత్​ బుమ్రా, మహమ్మద్​ షమీ, మహమ్మద్​ సిరాజ్​లు కలిసి ఏకంగా 45 వికెట్లు పడగొట్టారు. స్పిన్​ ద్వయం రవీంద్ర జడేజా, కుల్దీప్​ యాదవ్​లు కూడా బౌలింగ్​లో భేష్​ అనిపించుకుంటున్నారు.

బలంగా భారత్​..
ఫీల్డింగ్‌లోనూ మనవాళ్లు బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. దీంతో స్వల్ప స్కోర్​లకే ఆలౌట్​ అవుతున్నాయి ప్రత్యర్థి జట్లు. ఇలా అన్ని అంశాల్లోనూ బలంగా ఉన్న టీమ్​ఇండియా ఈసారి కచ్చితంగా వరల్డ్​కప్​ను దక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్​ లవర్స్​. ఇక భారత్​ తన తదుపరి మ్యాచ్​ నవంబర్​ 15న ఆడనుంది. ముంబయి వేదికగా జరగబోయే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. నవంబర్​ 19న ఫైనల్​ పోరు జరగనుంది.

అన్ని విభాగాల్లో దుర్భేధ్యంగా టీమ్ఇండియా- వెంటాడుతున్న సెమీస్‌ ఫోబియా!

రూ2వేల టికెట్ రెండున్నర లక్షలకు- సెమీస్ క్రేజ్​ను క్యాష్ చేసుకుందామని అడ్డంగా దొరికి!

ABOUT THE AUTHOR

...view details