జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International YOGA Day) పురస్కరించుకుని.. దేశంలోని 9 రాష్ట్రాలలో 25 ఫిట్ ఇండియా యోగా సెంటర్లను (Fit India Yoga Centers) ప్రారంభించింది కేంద్రం. ఈ విషయాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, ఆయూష్ శాఖ మంత్రి కిరెన్ రిజిజు వెల్లడించారు.
"మన ప్రాచీన వారసత్వంలో భాగమైన యోగా.. ప్రస్తుత కాలంలో మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప బహుమతి యోగా. నిత్యం యోగాసనాలు వేస్తే శారీరక, మానసిక ఇమ్యూనిటీ మెరుగవుతుంది. ఈ కొత్త యోగా కేంద్రాల ద్వారా మరింత మందికి యోగా ప్రాముఖ్యత తెలుస్తుంది."
-కిరెన్ రిజిజు, కేంద్ర ఆయూష్ మంత్రి.