తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2023, 10:04 AM IST

ETV Bharat / sports

'అన్నీ తెలిసి నటించారు' - భారత జట్టు ఫైనల్స్​కు వెళ్లడంపై పాక్​ నటి అసూయ!

Pakistani Actress Comments On Team India : వన్డే ప్రపంచకప్​లో భాగంగా బుధవారం(నవంబర్​ 15)న న్యూజిలాండ్​తో జరిగిన సెమీస్​లో టీమఇండియా తమ విశ్వరూపాన్ని చూపించి ఫైనల్స్​కు చేరుకుంది. దీంతో ఆ జట్టుపై అటు క్రికెట్ అభిమానులతో పాటు ఇటు మాజీలు ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు. అయితే పాకిస్థాన్​కు చెందిన ఓ నటి మాత్రం సెన్సేషనల్​ కామెంట్స్​ చేసింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

Pakistani Actress Comments On Team India
Pakistani Actress Comments On Team India

Pakistani Actress Comments On Team India : 2023 ఏడాది వన్డే ప్రపంచకప్​లో టీమఇండియా సత్తా చాటుతోంది. లీగ్​ మ్యాచుల్లో వరుస విజయాలతో దూసుకెళ్లి.. సెమీస్​కు చేరుకున్న రోహిత్​ సేన.. అదే దూకుడుతో సెమీస్​ ఆడి ఇప్పుడు తుది పోరులోకి అడుగుపెట్టనుంది. సుమారు 12 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌ ఫైనల్స్​లో టీమ్ఇండియా వెళ్లడం పట్ల క్రికెట్​ లవర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా భారత జట్టును కొనియాడుతున్నారు. మాజీలు సైతం మన ప్లేయర్లను అభినందనలు తెలుపుతూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే పాకిస్థాన్​కు చెందిన నటి సెహర్‌ షిన్వారీ మాత్రం ఎప్పటిలాగే టీమ్​ఇండియాను దుయ్యబట్టింది. బీసీసీఐతో పాటు టీమ్ఇండియాపై సంచలన కామెంట్స్‌ చేసింది. ట్విట్టర్​ వేదికగా పోస్టులు పెట్టి అసూయను కనబరిచింది.

"టీమ్ఇండియా ప్లేయర్లు మంచి నటులు. ఈ మ్యాచ్‌ ముందుగానే ఫిక్స్‌ అయ్యిందని వారికి కూడా తెలుసు. కానీ నిజంగానే మ్యాచ్‌ ఆడుతున్నట్లు భలే నటించారు. ఇలా భారత జట్టు మరోసారి ప్రపంచ కప్‌ ఫైనల్స్​కు వెళ్లడాన్ని నేను అసలు జీర్ణించుకోలేకపోతున్నాను. భారత్ అన్నింటిలో మన దేశం కంటే ఎందుకు ముందు ఉందో అసలు అర్థం కావడం లేదు " అంటూ టీమ్ఇండియా పై వేర్వేరు ట్వీట్లలో తన కోపాన్ని బయటపెట్టింది.

ఇక ఈ పోస్టులు చూసిన క్రికెట్​ అభిమానులు ఆ పాక్ నటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట ఆమెపై విమర్శల వర్షాన్ని కురిపిస్తున్నారు. కామెంట్ల రూపంలో ఆమెను తిట్టిపోస్తున్నారు. అయితే షిన్వారీ భారత జట్టుపై ఇలాంటి కామెంట్స్​ చేయడం ఇదేం తొలి సారి కాదు. ప్రపంచకప్‌ ప్రారంభం నుంచే వివిధ సందర్భాల్లో టీమ్​ఇండియాపై అక్కసు చూపిస్తున్న ఈ నటి.. భారత్‌పై విజయం సాధిస్తే బంగ్లా ఆటగాళ్లతో డేటింగ్‌కు వెళ్తానంటూ అప్పట్లో బంపర్‌ ఆఫర్​ కూడా ఇచ్చింది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 2023 వరల్డ్​కప్​లో భారత్ ఫైనల్​కు దూసుకెళ్లింది. తొలి సెమీస్​లో న్యూజిలాండ్​పై 70 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ నిర్దేశించిన 398 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్ జట్టు.. 48.5 ఓవర్లలో 327 పరుగులు చేసి చేతులెత్తేసింది. డారిల్ మిచెల్ (138 పరుగులు), కేన్​ విలియమ్సన్ (69), గ్లెన్ ఫిలిప్స్​ (41) రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో మహ్మద్ షమి 7, జస్​ప్రీత్ బుమ్రా, కుల్​దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. 7 వికెట్లు పడగొట్టి కివీస్ పతనాన్ని శాసించిన మహ్మద్ షమీకి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ విజయంతో భారత్ మెగాటోర్నీ హిస్టరీలో నాలుగోసారి ఫైనల్స్​కు చేరింది.

ఐశ్వర్య రాయ్‌పై పాక్​ మాజీ క్రికెటర్​ అనుచిత వ్యాఖ్యలు- నెటిజెన్స్​ ఫైర్​!

Pakistan Team Kolkata Biryani : హోటల్‍లో డిన్నర్​కు పాక్​ టీమ్​ నో.. 'జామ్​ జామ్​'లో బిర్యానీ ఆర్డర్!

ABOUT THE AUTHOR

...view details