తెలంగాణ

telangana

ETV Bharat / sports

Cricket: భారత్,ఇంగ్లాండ్​ జట్లకు ఆడిన ఒకే ఒక్క క్రికెటర్ - Iftikhar Ali Khan Pataudi record

ప్రపంచ క్రికెట్​లో అరుదైన ఘనత సాధించారు పటౌడీ నవాబు ఇఫ్తికర్ అలీఖాన్. భారత్, ఇంగ్లాండ్ జట్ల తరఫున టెస్టుల్లో పాల్గొన్న ఏకైక ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

only cricketer play Test cricket India and England Iftikhar Ali Khan Pataudi
ఇఫ్తికర్ అలీఖాన్

By

Published : May 31, 2021, 5:30 PM IST

ఒక దేశం తరఫున క్రికెట్ ఆడి, మరో దేశ జాతీయ జట్టుకు ఆడాలంటే చాలా నిబంధనలు ఉంటాయి. అయితే గతంలో టీమ్​ఇండియా కెప్టెన్​గా, దిగ్గజ క్రికెటర్​గా పేరు తెచ్చుకున్న ఇఫ్తికర్ అలీఖాన్(Iftikhar Ali Khan).. అంతకు ముందు ఇంగ్లాండ్​ తరఫున కూడా పలు మ్యాచ్​లు ఆడారు. ఇలా రెండు దేశాల తరఫున టెస్టులు ఆడిన ఏకైక క్రికెటర్​గా గుర్తింపు తెచ్చుకున్నారు.

పటౌడీ వంశంలో ఎనిమిదో నవాబు ఇఫ్తికర్ పటౌడీ. 1946లో ఇంగ్లాండ్​ పర్యటనకు వెళ్లిన భారత క్రికెట్ జట్టుకు(Team india) కెప్టెన్​గా చేశారు. అయితే అంతకు ముందు 1932-34 మధ్య ఈయన ఇంగ్లాండ్​ జట్టులోనూ ఆడారు. ఇలా రెండు జట్ల తరఫున ఆడి రికార్డు(Cricket record) సృష్టించారు.

ఇఫ్తికర్ అలీఖాన్

బాలీవుడ్​లో ప్రస్తుతం హీరోగా ఆకట్టుకుంటున్న సైఫ్ అలీఖాన్(Saif Ali Khan).. ఇఫ్తికర్ పటౌడీ మనవడే కావడం విశేషం. తన కుమారుడు మన్సూర్​ అలీఖాన్ 11వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఇఫ్తికర్.. స్నేహితులతో గోల్ఫ్ ఆడారు. ఆ సమయంలో గుండెపోటు రావడం వల్ల ఆకస్మికంగా మృతి చెందారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details