ఒక్క మ్యాచ్ తమ జట్టు ప్రదర్శనను ప్రతిబింబించదని.. అది డబ్ల్యూటీసీ ఫైనల్(WTC final) అయినా అంతేనని టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli) తెలిపాడు. ఇది తనకు మరో సాధారణ మ్యాచ్తో సమానమని అన్నాడు.
ఐదురోజుల పాటు సాగే ఒక్క గేమ్ ఆధారంగా జట్టు ప్రదర్శనను నిర్ణయించకూడదు. ఒక్క మ్యాచ్.. గత నాలుగు-ఐదేళ్ల కృషిని ప్రతిబింబించదని ఆటను అర్థం చేసుకునేవారికి ఎవరికైనా తెలుస్తుంది. ఈ మ్యాచ్లో గెలిచినా, ఓడినా మాకు క్రికెట్ ఆగదు. మా సామర్థ్యం పట్ల నమ్మకంతో ఉంటూ.. ప్రతి అంశాన్ని సాధారణంగానే స్వీకరిస్తాము. ఇది బ్యాట్కి బాల్కి సంబంధించిన సమరం.
-విరాట్ కోహ్లీ, భారత కెప్టెన్
ఇదో పరీక్ష..