కరోనా కారణంగా ఈ ఐపీఎల్ను(IPL) మధ్యలోనే నిలిపివేశారు. అనంతరం పలు దఫా చర్చలు ద్వారా మిగతా సగం సీజన్ను యూఏఈకి తరలించినట్లు శనివారం ప్రకటించారు. అయితే ఈ మెగాలీగ్ అక్కడ నిర్వహించడానికి కారణం కరోనా కాదని బీసీసీఐ సెక్రటరీ జైషా చెప్పారు. వాతవరణ సమ్యసల వల్లే దుబాయ్కు మార్చినట్లు స్పష్టం చేశారు.
IPL 2021: 'ఐపీఎల్ రీషెడ్యూల్.. కరోనా కారణం కాదు' - ipl shifted reason
ఐపీఎల్ యూఏఈకి తరలించడానికి కరోనా కారణం కాదని చెప్పారు బీసీసీఐ సెక్రటరీ జైషా. సెప్టెంబరులో భారీగా వర్షాలు పడే అవకాశమున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
![IPL 2021: 'ఐపీఎల్ రీషెడ్యూల్.. కరోనా కారణం కాదు' bcci](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11950959-963-11950959-1622354527759.jpg)
బీసీసీఐ
"సెప్టెంబరులో భారీగా వర్షాలు పడే అవకాశమున్నందున ఐపీఎల్ను ఇక్కడ(ముంబయి, అహ్మదాబాద్ లేదా ఇతరత్రా వేదికల్లో) నిర్వహించడం కష్టంగా ఉంటుంది. అందుకే యూఏఈలో జరపాలని నిర్ణయించాం" అని జై షా అన్నారు.
ఇదీ చూడండి డబ్ల్యూటీసీ ఫైనల్కు గంగూలీ.. భారత క్రికెటర్లకు వ్యాక్సిన్!