తెలంగాణ

telangana

By

Published : May 30, 2021, 11:56 AM IST

ETV Bharat / sports

IPL 2021: 'ఐపీఎల్ రీషెడ్యూల్..​ కరోనా కారణం కాదు'

ఐపీఎల్​ యూఏఈకి తరలించడానికి కరోనా కారణం కాదని చెప్పారు బీసీసీఐ సెక్రటరీ జైషా. సెప్టెంబరులో భారీగా వర్షాలు పడే అవకాశమున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

bcci
బీసీసీఐ

కరోనా కారణంగా ఈ ఐపీఎల్​ను(IPL) మధ్యలోనే నిలిపివేశారు. అనంతరం పలు దఫా చర్చలు ద్వారా మిగతా సగం సీజన్​ను యూఏఈకి తరలించినట్లు శనివారం ప్రకటించారు. అయితే ఈ మెగాలీగ్​ అక్కడ నిర్వహించడానికి కారణం కరోనా కాదని బీసీసీఐ సెక్రటరీ జైషా చెప్పారు. వాతవరణ సమ్యసల వల్లే దుబాయ్​కు మార్చినట్లు స్పష్టం చేశారు.

"సెప్టెంబరులో భారీగా వర్షాలు పడే అవకాశమున్నందున ఐపీఎల్​ను ఇక్కడ(ముంబయి, అహ్మదాబాద్​ లేదా ఇతరత్రా వేదికల్లో) నిర్వహించడం కష్టంగా ఉంటుంది. అందుకే యూఏఈలో జరపాలని నిర్ణయించాం" అని జై షా అన్నారు.

ఇదీ చూడండి డబ్ల్యూటీసీ ఫైనల్​కు గంగూలీ.. భారత క్రికెటర్లకు వ్యాక్సిన్​!

ABOUT THE AUTHOR

...view details