ఇటీవలే ఇంగ్లాండ్ పర్యటనలో ఏడేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడింది భారత మహిళా జట్టు. ఈ మ్యాచ్ను డ్రా చేసుకుని ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది. తొలిసారి ఓ డేనైట్ టెస్టులో తలపడబోతుంది. ఓ టెస్టుతో పాటు ఈ పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ పర్యటన సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 11 వరకు జరగనుంది. పెర్త్ వేదికగా సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు గులాబీ బంతి టెస్టు జరుగుతుంది. ఈ క్రమంలోనే జట్టును ప్రకటించింది బీసీసీఐ.
చారిత్రక డేనైట్ టెస్టుతో పాటు వన్డే సిరీస్కు సారథ్యం వహించనుంది మిథాలీ రాజ్. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో టీ20 సిరీస్ ఆడనుంది. టెస్టు, వన్డే జట్టులో సీనియర్ క్రికెటర్లు హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ వారి స్థానాలను కాపాడుకున్నారు. షెఫాలీ వర్మ మరోసారి ఓపెనర్గా సత్తాచాటేందుకు సిద్ధమైంది. అలాగే ఇంగ్లాండ్ పర్యటనలో మంచి ప్రదర్శన కనబర్చిన స్నేహ్ రానా ఆస్ట్రేలియా పర్యటనకూ ఎంపికైంది. ప్రియా పూనియా, ఇంద్రాని రాయ్లకు చోటు దక్కలేదు.
అలాగే టీ20 జట్టులో పెద్దగా మార్పూలేమీ జరగలేదు. రిచ్ ఘోష్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించనుంది. రేణుకా సింగ్, యాస్తికా భాటికాకు తొలిసారి అవకాశం దక్కింది.