ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్కు ముందు కోహ్లీసేన సన్నాహక పోరుకు సిద్ధమైంది. మంగళవారం నుంచే కౌంటీ సెలెక్ట్ ఎలెవన్ (INDIA vs COUNTY SELECT ELEVEN)తో మూడు రోజుల మ్యాచ్. కళ్లన్నీ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal)పైనే. టెస్టు తుది జట్టులో స్థానాన్ని ఆశిస్తున్న అతడు ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నాడు. గిల్ గైర్హాజరీలో తొలి టెస్టులో రోహిత్తో కలిసి మయాంక్ ఓపెనర్గా దిగే అవకాశాలు మెండుగా ఉన్న నేపథ్యంలో.. అతడి ఆటను జట్టు యాజమాన్యం నిశితంగా పరిశీలించనుంది.
రిషబ్ పంత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. కొవిడ్ పాజిటివ్గా తేలిన పంత్ లండన్లో సన్నిహితుల ఇంట్లో 10 రోజులు ఐసోలేషన్ పూర్తి చేసుకున్నాడని బీసీసీసీఐ వర్గాలు తెలిపాయి. వేగంగా కోలుకుంటున్న అతడు, డర్హమ్లో బయో బబుల్లో ఇంకా చేరలేదని చెప్పాయి.