తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత అభిమానులపై మ్యాక్స్​వెల్​ భార్య​ ఫైర్​- మీ ఆగ్రహాన్ని వాటిపై చూపించండి అంటూ! - విని రామన్ మ్యాక్స్​వెల్ పెళ్లి

Maxwell Wife Vini Raman Slams Indian Fans : వరల్డ్ కప్​ ఫైనల్​లో టీమ్ఇండియాను ఆస్ట్రేలియా ఓడించింది. ఆ తర్వాత తనకు వచ్చిన విద్వేషపూరితమైన మెసేజ్​లపై ఆసీస్​ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్​వెల్ భార్య విని రామన్ స్పందించింది. భారత క్రికెట్ అభిమానులపై తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది.

Maxwell Wife Vini Raman Slams Indian Fans
Maxwell Wife Vini Raman Slams Indian Fans

By ETV Bharat Telugu Team

Published : Nov 20, 2023, 5:56 PM IST

Updated : Nov 20, 2023, 6:17 PM IST

Maxwell Wife Vini Raman Slams Indian Fans :భారత క్రికెట్ అభిమానులపై.. ఆస్ట్రేలియా వరల్డ్​ కప్​ టీమ్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్​వెల్ భార్య విని రామన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం జరిగిన వరల్డ్​ కప్​ ఫైనల్​లో ఆసీస్​, భారత్​ను ఓడించిన తర్వాత​ తనకు వచ్చిన విద్వేషపూరితమైన మెసేజ్​లపై స్పందించిన రామన్​.. ఉన్నతంగా ప్రవర్తించండి అంటూ హితవు పలికింది. ఈ మేరకు తన ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో పోస్టు పెట్టింది.

"ఉన్నతంగా ప్రవర్తించండి. నేను ఇలా చెబుతున్నానని నమ్మలేకపోతున్నాను. మీరు భారతీయులు అయి ఉండవచ్చు. కానీ మీరు పుట్టి పెరిగిన దేశాన్ని కూడా గౌరవించండి. ముఖ్యంగా మీ భర్త టీమ్​ను, మీ బిడ్డకు తండ్రిని. (తెలివితక్కువ వాళ్లు) ఒక చిల్​ పిల్​ వేసుకుని మీ ఆగ్రహాన్ని ప్రపంచ సమస్యలపై చూపించండి" అని విని రామన్ తీవ్రంగా స్పందించింది.

ఆదివారం టీమ్ఇండియా ఫైనల్​లో ఓడిపోవడం వల్ల కోట్లాది మంది భారత అభిమానులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అయితే వినిరామన్​ తల్లిదండ్రులు తమిళనాడుకు చెందిన వారు. విని ఆస్ట్రేలియాలో పుట్టిపెరిగింది. ఆదివారం ఆస్ట్రేలియా ఆరోసారి వరల్డ్​ కప్​ గెలిచిన తర్వాత.. ఆ దేశానికి సపోర్ట్​ చేసింది. అయితే అందుకు భారత అభిమానులు ఆమెను ట్రోల్​ చేయడం వల్ల.. విని రామన్ తిరిగి స్పందించింది. తాను ఆస్ట్రేలియాలో పుట్టిపెరిగినట్లు వివరించింది.

Vini Raman Glenn Maxwell Wedding :గ్లెన్​ మ్యాక్స్​వెల్, వినిరామన్​ 2022 మార్చి 18న క్రిస్టియన్​ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత మార్చి 27 చెన్నైలో తమిళ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. గత సెప్టెంబర్​లో విని రామన్​ మగబడ్డికు జన్మనిచ్చింది.
ఇదిలా ఉండగా.. గ్లెన్​ మ్యాక్స్​వెల్ ఈ వరల్డ్​ కప్​లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఆదివారం మ్యాచ్​లో చివర్లో వచ్చి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అంతుకుముందు లీగ్​ స్టేజ్​లో అఫ్గానిస్థాన్​లో జరిగిన మ్యాచ్​లో డబుల్​ సెంచరీ చేసి ఔరా అనిపించాడు. ధర్మశాల వేదికగా న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో 40 బంతుల్లోనే అత్యంత వేగవంతమైన శతకం బాదడం విశేషం.

వరల్డ్​కప్ ట్రోఫీపై కాళ్లేసి ఫోజులు- మార్ష్​పై నెటిజన్లు ఫైర్ - ఇండియన్స్​ను చూసి నేర్చుకోవాలంటూ!

'నిన్న మన రోజు కాదు మేము మళ్లీ పుంజుకుంటాం' షమీ ఎమోషనల్ పోస్ట్​!

Last Updated : Nov 20, 2023, 6:17 PM IST

ABOUT THE AUTHOR

...view details