వికెట్లు తీసేందుకు కుల్దీప్ యాదవ్ (Kuldeep yadav) ఏదో ఒక దారి వెతకాలని టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ వెంకటపతి రాజు అన్నాడు. అతడికి సలహాలిచ్చేందుకు ఇప్పుడు ధోనీ లేడని గుర్తు చేశాడు. శ్రీలంక సిరీస్ అతడికి మంచి అవకాశమని తెలిపారు. ఇక్కడ రాణిస్తే ఐపీఎల్, టీ20 ప్రపంచకప్లో మెరుగైన అవకాశాలు ఉంటాయని వెల్లడించాడు.
"శ్రీలంక పిచ్లు నెమ్మదిగా ఉంటాయి. కుల్దీప్ పునరాగమనానికి ఇవి అనువైనవి. ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ జరిగే యూఏఈలోనూ పిచ్లు ఇలాగే ఉంటాయి. దాంతో కుల్దీప్ మ్యాచ్ విజేతగా మారే అవకాశాలూ ఉన్నాయి. అతడి కెరీర్రో సారథుల పాత్రే కీలకంగా మారింది. ధోనీ నేతృత్వంలో బాగా రాణించానని అంటుంటాడు. కానీ ఇప్పుడతను లేడు. కాబట్టి ఏదో ఒక దారి వెతకాలి. అతడు యువకుడు. తెలివైన బౌలర్. అంతర్జాతీయ అనుభవం ఉంది. వికెట్లు తీయడంపై ఏకాగ్రత పెడితే మంచిది. పరిమిత అవకాశాలే దొరుకుతాయని అతడు దృష్టిలో పెట్టుకొని ఆడాలి. ఒత్తిడి చెందొద్దు. వైవిధ్యం ప్రదర్శించాలి. క్రికెట్ సులభం కాదని అతడికి తెలుసు. కఠోరంగా శ్రమించాలి. కుల్దీప్కు ఓ మంచి అలవాటుంది. ఒక వికెట్ పడగొట్టాడంటే చాలు మ్యాచులో రెండు లేదా మూడు వికెట్లు తీస్తుంటాడు" అని రాజు తెలిపాడు.