తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధనాధన్​ ఇషాన్​.. అరంగేట్రంలోనే అర్ధశతకం

అరంగేట్ర మ్యాచ్​లోనే ఇషాన్​ కిషన్​ అదరగొట్టాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో కేవలం 33 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. ఇషాన్​ క్రీజులో ఉన్నంతసేపు లంక బౌలర్లకు చెమటలు పట్టించాడు.

By

Published : Jul 18, 2021, 8:51 PM IST

Updated : Jul 18, 2021, 9:16 PM IST

ishan
కిషన్​

టీమ్​ఇండియా యువ వికెట్​కీపర్​ ఇషాన్​ కిషన్​ దుమ్మురేపాడు. తన తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్​లో విజృంభించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో.. కేవలం 33బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తిచేసుకున్నాడు.

ధనాధన్​..

పృథ్వీ షా ఔట్​ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్​.. ఒక్క సెకండ్​ను కూడా వృథా చేయలేదు. తొలి బంతిని సిక్సర్​గా మలిచాడు ఈ ఎడమ చేతివాటం బ్యాట్స్​మన్​. ఇక ఆ తర్వాతి బంతికి ఫోర్​ కొట్టాడు. ధనాధన్​ బ్యాటింగ్​తో మైదానం అన్ని వైపులా పరుగులు రాబట్టాడు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్​లో ఇషాన్​ బౌండరీలు బాదుతుంటే లంక ఆటగాళ్లు చూస్తూ ఉండిపోవడం తప్ప ఏం చేయలేకపోయారు.

సహజంగా.. ఎవరైనా తొలి వన్డే ఆడుతుంటే.. కాస్త నెమ్మదిగా, ఆచితూచి బ్యాటింగ్​ చేస్తారు. కానీ ఇషాన్​ కిషన్​ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఈ నేపథ్యంలోనే తొలి అర్థశతకాన్ని సిక్సర్​తో అందుకున్నాడు. ఇషాన్​ దూకుడు చూస్తుంటే సెంచరీ ఖాయం అనుకున్న తరుణంలో.. 59పరుగులకు ఔట్​ అయ్యాడు.

ఆదివారం ఇషాన్​ కిషన్​ పుట్టినరోజు కావడం మరో విశేషం!

'ఇషాన్​' విశేషాలు..

  • టీమ్​ఇండియా తరఫున అరంగేట్ర టీ20, వన్డే మ్యాచుల్లో అర్ధశతకం సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు ఇషాన్​. తొలుత ఈ ఘనతను రాబిన్​ ఉతప్ప సాధించాడు.
  • అరంగేట్ర వన్డే మ్యాచ్​లో.. అతితక్కువ బంతుల్లో 50 పరుగులు చేసిన ఆటగాళ్లల్లో ఇషాన్​ రెండోస్థానంలో నిలిచాడు. ఇషాన్​ 33 బంతుల్లో హాఫ్​ సెంచరీ చేయగా.. ఈ ఏడాది ఇంగ్లాండ్​పై కృనాల్​ పాండ్యా కేవలం 26 బంతుల్లోనే ఆర్ధశతం చేశాడు.

ఇదీ చూడండి:-IND vs SL: రాణించిన లంక బ్యాట్స్​మెన్​.. భారత్​ లక్ష్యం 263

Last Updated : Jul 18, 2021, 9:16 PM IST

ABOUT THE AUTHOR

...view details