తెలంగాణ

telangana

By

Published : Mar 14, 2021, 6:22 AM IST

Updated : Mar 14, 2021, 6:58 AM IST

ETV Bharat / sports

ఐపీఎల్​ కొత్త ఫ్రాంఛైజీల కోసం 'మే'లో వేలం

వచ్చే ఏడాది (2022) నుంచి ఐపీఎల్​లో 10 జట్లు పోటీపడనున్నాయి. రెండు కొత్త ఫ్రాంఛైజీల కోసం మే నెలలో వేలం నిర్వహించనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

Two new IPL teams to be auctioned in May
ఐపీఎల్​లో ఫ్రాంఛైజీల కోసం మేలో వేలం

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్​)లో 2022 నుంచి 10 జట్లు ఆడనున్నాయి. ఈ మేరకు మరో రెండు జట్ల కోసం మే నెలలో.. వేలం నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జై షా సహా.. ఉన్నతాధికారులు శనివారం సమావేశం నిర్వహించారు.

ఈ ఏడాది ప్రారంభంలో.. ఐపీఎల్​ పాలక మండలి ఆమోదించిన పలు నిర్ణయాల అమలుపై చర్చించారు. ఈ సమావేశంలోనే.. కొత్త ఫ్రాంఛైైజీలు, బిడ్డింగ్‌ ప్రక్రియ వంటివాటిపై నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. జట్లపై తుది నిర్ణయం రాగానే.. ఆయా జట్లు తదుపరి ప్రక్రియను ప్రారంభించుకోవచ్చని బీసీసీఐ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:'అందుకే ధోనీని సారథిగా కొనసాగిస్తున్నాం'

Last Updated : Mar 14, 2021, 6:58 AM IST

ABOUT THE AUTHOR

...view details