తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2021: ఈసారి కూడా పంత్​కే కెప్టెన్సీ

యూఏఈలో జరిగే ఐపీఎల్ (IPL 2021)​ రెండో దశలోనూ పంత్​ సారథిగా(rishabh pant captaincy)) కొనసాగుతాడని దిల్లీ క్యాపిటల్స్​ జట్టు అధికారికంగా స్పష్టం చేసింది. సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్​ రెండో దశ ప్రారంభం కానుంది. ఇప్పటికే యూఏఈ చేరుకున్న జట్లు, క్వారంటైన్​లో ఉన్నాయి.

By

Published : Sep 16, 2021, 6:13 PM IST

Updated : Sep 16, 2021, 6:59 PM IST

panth
పంత్​

త్వరలో మొదలయ్యే ఐపీఎల్​ రెండో దశలోనూ(IPL 2021) దిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్​గా రిషభ్​​ పంత్(rishabh pant captaincy)​ ఉంటాడని యాజమాన్యం స్పష్టం చేసింది.

రెగ్యులర్​ కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్(shreyas iyer replacement delhi capitals)​ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో పంత్​ను సారథిగా నియమిస్తూ అప్పుడు ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా.. వాయిదా పడగా, ఇప్పుడు రెండో దశకు శ్రేయస్​ కోలుకుని జట్టులో చేరాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్​గా ఎవరు వ్యవహరిస్తారు అనే విషయంపై చర్చ సాగింది. ఈ క్రమంలోనే పంత్​ కెప్టెన్సీ కొనసాగిస్తాడని ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి మెగాలీగ్​ రెండో(ipl 2021 second phase schedule) దశ ప్రారంభం కానుంది. సెప్టెంబరు 22న తమ తొలి మ్యాచ్​ను సన్​రైజర్స్​ హైదరాబాద్​తో ఆడనుంది.

ఇదీ చూడండి:IPL2021: 'అలా జరగకపోతే పానీపూరీ అమ్ముకునేవాడిని'

Last Updated : Sep 16, 2021, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details