తెలంగాణ

telangana

ETV Bharat / sports

దిల్లీకి షాక్​.. పంత్​కు భారీ జరిమానా.. కోచ్​పై వేటు - praveen amre

Rishabh Pant Fined: దిల్లీ క్యాపిటల్స్​ సారథి రిషభ్ పంత్​పై 100 శాతం మ్యాచ్​ ఫీజును జరిమానాగా విధించింది ఐపీఎల్. రాజస్థాన్​తో మ్యాచ్​ సందర్భంగా అతడు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడని పేర్కొంది. ఇక దిల్లీ సహాయక కోచ్​పై జరిమానాతో పాటు ఒక మ్యాచ్​ నిషేధం పడింది.

rishabh pant no ball
rishabh pant fined

By

Published : Apr 23, 2022, 1:03 PM IST

Rishabh Pant Fined: దిల్లీ క్యాపిటల్స్​కు భారీ షాక్​! ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్, పేసర్​ శార్దూల్​ ఠాకూర్​కు భారీ జరిమానా పడింది. సహాయక కోచ్​ ప్రవీణ్ ఆమ్రేపై ఒక మ్యాచ్​ నిషేధం కూడా విధించింది ఐపీఎల్. పంత్​, ఆమ్రేలకు 100శాతం మ్యాచ్​ ఫీజును జరిమానాగా విధించగా, శార్దూల్​పై 50శాతం ఫైన్ పడింది. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో వారు ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అందుకు కారణం. ఈ మ్యాచ్​లో 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది దిల్లీ.

ఇదీ జరిగింది:గతరాత్రి రాజస్థాన్‌ నిర్దేశించిన 223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దిల్లీకి చివరి ఓవర్‌లో 36 పరుగులు అవసరమయ్యాయి. ఆ సమయంలో రోమన్‌ పావెల్‌ (36; 15 బంతుల్లో 5x6) తొలి 3 బంతుల్ని 3 సిక్సర్లుగా మలిచి మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చేశాడు. అయితే, మూడో బంతి అతడి నడుముపైకి రావడం వల్ల అది నోబాల్‌లా కనిపించింది. దీనిపై పావెల్‌ ఫీల్డ్‌ అంపైర్లను నిర్ధారించుకోవాలని అడిగినా వాళ్లు థర్డ్‌ అంపైర్‌కు నివేదించలేదు. దీంతో కాసేపు మైదానంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

అందుకు నిరసనగా దిల్లీ కెప్టెన్‌ పంత్‌.. తమ బ్యాట్స్‌మెన్‌ను మైదానం వీడి బయటకు రావాలని పిలిచాడు. వెంటనే సహాయ కోచ్‌ ఆమ్రె కలగజేసుకొని మైదానంలోకి వెళ్లి అంపైర్లతో మాట్లాడాడు. తర్వాత పరిస్థితులు సద్దుమణగడం వల్ల మ్యాచ్‌ జరిగింది. అయితే పంత్​ తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు మాజీలు పంత్​ను తప్పు పడుతుండగా, అది నోబాల్​ అంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు అతడికి మద్దతుగా నిలుస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details