తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ను యూకేలో నిర్వహించాలి: పీటర్సన్​ - IPL 2021 should be held in UK Pietersen

వాయిదా పడిన ఐపీఎల్​ను యూకేలో నిర్వహించాలని మాజీ క్రికెటర్ పీటర్సన్​ అభిప్రాయపడ్డాడు. అంతకుముందు నాలుగు ఇంగ్లీష్​ కౌంటీలు కూడా ఈ మెగాలీగ్​ను నిర్విహించేందుకు ఆసక్తి చూపాయి.

ipl
ఐపీఎల్​

By

Published : May 8, 2021, 5:43 PM IST

నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్​ను యుఏఈలో సెప్టెంబరులో నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన ఇంగ్లాండ్​ మాజీ సారథి కెవిన్​ పీటర్సన్​.. ఈ సీజన్​లోని మిగిలిన మ్యాచ్​ల్ని యూకేలో జరపాలని అన్నాడు.

ప్రపంచటెస్టు ఛాంపియన్​షిప్​(జూన్​ 18-22) సహా ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​(ఆగస్టు 4-సెప్టెంబరు 14) ఆడేందుకు టీమ్​ఇండియా, ఇంగ్లాండ్​ పర్యటనకు వెళ్లనుంది. అది పూర్తవ్వగానే అక్టోబరు-నవంబరులో భారత్​ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ రెండింటి మధ్యలోనే ఐపీఎల్​ రెండో దశ నిర్వహించాలని యోచిస్తోంది బీసీసీఐ. కాబట్టి మెగాలీగ్​ను తమ వద్ద నిర్వహించడం వల్ల ఇంగ్లాండ్​, భారత్​ ఆటగాళ్లు టెస్టు సిరీస్ పూర్తవ్వగానే ఎటూ ప్రయాణించకుండా అక్కడే ఆడొచ్చనే ఆలోచనతో అన్నాడు పీటర్సన్​.

పీటర్సన్​

"సెప్టెంబరులో ఇంగ్లాండ్​-భారత్​ టెస్టు సిరీస్​ పూర్తవ్వగానే ఇరు జట్ల ఉత్తమ ఆటగాళ్లు అక్కడే అందుబాటులో ఉంటారు. కాబట్టి యూకేలోనే ఐపీఎల్​ నిర్వహించడం మంచిదని నా అభిప్రాయం."

-పీటర్సన్​, ఇంగ్లాండ్​ మాజీ సారథి.

అంతకుముందు మిగిలిన ఐపీఎల్​ మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఇంగ్లాండ్‌లోని నాలుగు కౌంటీ క్రికెట్‌ క్లబ్‌లు ఆసక్తి చూపాయి. లార్డ్స్‌, ఓవల్‌, ఎడ్​బాస్టన్‌, ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ మైదానాల్లో ఆయా మ్యాచ్‌లు నిర్వహించాలని మిడిల్‌సక్స్‌, సర్రే, వార్క్‌షైర్‌, లాంకషైర్‌ క్లబ్‌లు.. తమ ఆసక్తిని ఇంగ్లాండ్​ బోర్డుకు తెలియజేశాయి. ఈ విషయాన్ని బీసీసీఐతో చర్చించాలని కోరాయి.

ఇదీ చూడండి: ఐపీఎల్​ ఆతిథ్యానికి ఇంగ్లీష్​​ కౌంటీలు ఆసక్తి

ABOUT THE AUTHOR

...view details