కొవిడ్ కారణంగా తాత్కాలికంగా ఐపీఎల్కు దూరమైన దిల్లీ క్యాపిటల్స్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు ఆ జట్టు ప్రత్యామ్నాయాన్ని ప్రకటించింది. ఈ లీగ్లోనే తొలిసారిగా కొవిడ్ తాత్కాలిక ఆటగాడిగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షామ్స్ ములానిని దిల్లీ జట్టులో చేర్చింది. అతడు అక్షర్ కోలుకుని జట్టులోకి వచ్చే వరకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. ముంబయికి చెందిన 24 ఏళ్ల ములాని.. ఇప్పటిదాకా 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 28 వికెట్లు తీశాడు. 556 పరుగులు కూడా చేశాడు.
ఇదీ చదవండి:ఐపీఎల్: పంజాబ్పై చెన్నై విజయం సాధిస్తుందా?