దిల్లీ క్యాపిటల్స్తో(DC Vs CSK 2021) జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. చివర్లో వరుస బౌండరీలతో తమ జట్టును గెలిపించాడు. మెరుపు షాట్లతో వింటేజ్ మహీని చూసిన ఓ చిన్నారి అభిమాని కళ్ల నుంచి ఆనందభాష్పాలు రాలాయి. ఆ సంఘటన కెమెరా కంట పడగా.. ఆ చిన్నారిని చూసిన ప్రేక్షకులతో పాటు ధోనీ మనసు కూడా కరిగింది. దీంతో మ్యాచ్ అనంతరం తన ఫ్యాన్కు ధోనీ ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ అందించాడు. తాను సంతకం చేసిన ఓ బంతిని ఆ చిన్నారికి అందజేశాడు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
సంతోషం.. భావోద్వేగం..
అదే విధంగా ధోనీ సూపర్ ఇన్నింగ్స్ను ప్రత్యక్షంగా చూసిన అతని భార్య సాక్షి.. స్టాండ్స్లో ఎంతో ఉత్సాహంగా కనిపించింది. చెన్నై జట్టు విజయం సాధించిన తర్వాత తమ పాప జీవాను హత్తుకొని సాక్షి భావోద్వేగానికి లోనయ్యింది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
ఐపీఎల్ 14వ సీజన్(IPL 2021 News)లో చెన్నై సూపర్ కింగ్స్(chennai super kings 2021) ఫైనల్ చేరింది. ఐపీఎల్ చరిత్రలో తొమ్మిదోసారి ఫైనల్కు చేరుకున్న టీమ్గా సీఎస్కే నిలిచింది. ఆదివారం రాత్రి దిల్లీ క్యాపిటల్స్(DC Vs CSK 2021)తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో చెన్నై రెండు బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ధోనీ (18 నాటౌట్; 6 బంతుల్లో 3x4, 1x6) మునుపటిలా ఫినిషర్ పాత్ర పోషించి మ్యాచ్ను గెలిపించిన తీరు అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని కలిగించింది.
ఇదీ చూడండి..ఆ పరిస్థితుల నుంచి బయటపడాలనుకున్నా: ధోనీ