గురువారం చెన్నైలో జరగనున్న ఐపీఎల్ వేలం నుంచి ఇంగ్లాండ్ క్రికెటర్ మార్క్ వుడ్ తప్పుకున్నాడు. వేలంలో రూ.2 కోట్ల ఆటగాళ్ల జాబితాలో ఉన్న వుడ్.. కుటుంబంతో తగిన సమయం కేటాయించేందుకే ఈ ఏడాది లీగుకు దూరంగా కానున్నాడని తెలుస్తోంది.
ఐపీఎల్ వేలం నుంచి ఇంగ్లాండ్ క్రికెటర్ ఔట్ - మార్క్ వుడ్ ఐపీఎల్
ఐపీఎల్ 14వ సీజన్ వేలం నుంచి ఇంగ్లాండ్ క్రికెటర్ మార్క్ వుడ్ తప్పుకున్నాడు. కుటుంబంతో తగిన సమయం గడిపేందుకు లీగు నుంచి అతడు తప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ వేలం నుంచి ఇంగ్లాండ్ క్రికెటర్ ఔట్
బుధవారం చెన్నైలోని జట్టు శిబిరంలోకి మార్క్ వుడ్, వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో చేరారు. టీమ్ఇండియాతో జరగనున్న మిగిలిన రెండు టెస్టుల్లో వీరిద్దరూ ఆడనున్నారు.
ఇదీ చూడండి:ఐపీఎల్-2021 వేలం: ఈ విషయాలు తెలుసుకోండి!