తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్ టైమ్​లో సిరీస్​లా.. క్రికెట్ బోర్డులతో పీటర్సన్! - Pietersen on IPL

జాతీయ జట్టుకు కాకుండా ఐపీఎల్​లో కొందరు క్రికెటర్లు పాల్గొనడంపై పీటర్సన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో బోర్డులు సిరీస్​లు పెట్టుకోవద్దని సూచించాడు.

Let's not schedule international cricket when biggest show unfolds: Pietersen on IPL
ఐపీఎల్ టైమ్​లో సిరీస్​లా.. క్రికెట్ బోర్డులతో పీటర్సన్!

By

Published : Apr 2, 2021, 10:14 PM IST

వివిధ దేశాల క్రికెట్ బోర్డులకు ఐపీఎల్ విషయమై కీలక సూచన చేశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్​ కెవిన్ పీటర్సన్. లీగ్​ నిర్వహించే సమయంలో ఎలాంటి సిరీస్​లు పెట్టుకోవద్దని అన్నాడు. ఐపీఎల్​ను 'బిగ్గెస్ట్ షో ఇన్ ద టౌన్' అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అభిప్రాయపడ్డాడు.

జూన్ 2 నుంచి న్యూజిలాండ్​తో రెండు టెస్టుల సిరీస్​ ఇంగ్లాండ్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్​ లేదా జాతీయ జట్టుకు ఆడాలా అనే ఆలోచనలో ఉన్నారు ఇంగ్లీష్ క్రికెటర్లు. ఆ దేశ బోర్డు ఇప్పుటికే దీని గురించి ప్రకటన చేసింది. ఎందులో ఆడాలి అనే విషయమై తాము క్రికెటర్లపై ఒత్తిడి తీసుకురామని ఇంగ్లాండ్ డైరెక్టర్ ఆస్లే గిల్స్​ అన్నారు.

ఈ సీజన్​లో ఇంగ్లీష్ జట్టుకు చెందిన 14 మంది ఆటగాళ్లు ఐపీఎల్​లో ఆడుతున్నారు. మోర్గాన్, బట్లర్, స్టోక్స్, బెయిర్​స్టో, మొయిన్ అలీ, సామ్ కరన్, టామ్ కరన్, లివింగ్ స్టోన్, డేవిడ్ మలన్ ఇందులో ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details