ఐపీఎల్ జరుగుతున్న సమయంలో భారత్లోని కనిపించిన దృశ్యాలు కలచివేశాయని సన్రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ చెప్పాడు. ఆక్సిజన్ లేక ప్రజలు ఇబ్బందిపడటం, శ్మశానాల్లో తమ కుటుంబసభ్యుల అంతిమ సంస్కారాలు చేసేందుకు జనాలు క్యూ కట్టడం లాంటి సంఘటనలు తనను బాధించాయని అన్నాడు.
WARNER: 'భారత్లో ఆ దృశ్యాలు చూసి కలత చెందా' - ఐపీఎల్ న్యూస్
భారత్లో ఆక్సిజన్ లేక పలువురు ప్రజలు ప్రాణాలు వదిలేయడం, శ్మశానాల్లో జనాలు ఎక్కువగా ఉండటం లాంటి దృశ్యాలు చూసి తమ మనసు కలత చెందిందని వార్నర్ అన్నాడు. ఐపీఎల్ వాయిదా వేసి, బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుందని చెప్పాడు.
![WARNER: 'భారత్లో ఆ దృశ్యాలు చూసి కలత చెందా' It was terrifying, upsetting: Warner on stay in India during IPL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11988468-868-11988468-1622626156924.jpg)
వార్నర్
కొవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం ఉన్నప్పటికీ ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. బయోబబుల్లో ఉన్న పలువురు ఆటగాళ్లకు పాజిటివ్గా తేలడం వల్లే బీసీసీఐ, ఈ సీజన్ను నిరవధిక వాయిదా వేసింది. ఈ ఏడాది సెప్టెంబరు-అక్టోబరులో యూఏఈ వేదికగా మిగిలిన మ్యాచ్ల్ని నిర్వహించనున్నారు.
ఇవీ చదవండి: