తెలంగాణ

telangana

By

Published : Apr 13, 2023, 9:28 PM IST

ETV Bharat / sports

IPL 2023 : అదరగొట్టిన గుజరాత్​ బౌలర్లు.. పంజాబ్​ స్కోరు ఎంతంటే?

ఐపీఎల్​ 16వ సీజన్​లో భాగంగా గుజరాత్​తో జరుగుతున్న మ్యాచ్​లో పంజాబ్​ ఇన్నింగ్స్​ ముగిసింది. అయితే గుజరాత్​ టార్గెట్​ ఎంతంటే?

Etv Bharatipl 2023 gujarat titans punjab kings match gujarat target runs
Etv Bharatipl 2023 gujarat titans punjab kings match gujarat target runs

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ 16న సీజన్​లో భాగంగా గుజరాత్​ టైటాన్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో పంజాబ్​ కింగ్స్​​ జట్టు ఇన్నింగ్స్​ ముగిసింది. 20 ఓవరల్లో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు సాధించింది. ప్రత్యర్థి గుజరాత్​కు 154 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పంజాబ్​ బ్యాటర్లలో మాథ్యూ షార్ట్​ (36) టాప్​ స్కోరర్​గా నిలిచాడు. గుజరాత్​ బౌలర్లలో మహమ్మద్​ షమి, లిటిల్​, జోసెఫ్​, రషిద్​ ఖాన్ తలో ఒక​ వికెట్ పడగొట్టారు. మోహిత్​ శర్మ రెండు వికెట్లు తీశాడు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు షమి వేసిన తొలి ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్ (0) రెండో బంతికే రషీద్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం వన్‌డౌన్‌ బ్యాటర్‌గా వచ్చి దూకుడుగా ఆడాడు మాథ్యూ షార్ట్. మంచి ఫామ్‌లో ఉన్న శిఖర్‌ ధావన్ (8) ఔటయ్యాడు. లిటిల్‌ వేసిన నాలుగో ఓవర్‌లో రెండో బంతికి ధావన్‌ అల్జారీ జోసెఫ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత షార్ట్​ (36).. క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. రషీద్‌ ఖాన్‌ తన తొలి ఓవర్‌లోనే షార్ట్​ వికెట్ పడగొట్టాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన జితేశ్ శర్మ (25) ఔటయ్యాడు. మోహిత్‌ శర్మ వేసిన 12.2 ఓవర్‌కు వికెట్‌ కీపర్‌ వృద్ధీమాన్‌ సాహాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. తొలుత అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించడంతో గుజరాత్ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య డీఆర్‌ఎస్‌కు వెళ్లాడు. అక్కడ ఫలితం గుజరాత్‌కు అనుకూలంగా వచ్చింది. తర్వాత క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్స (20) ఔటయ్యాడు. అల్జారీ జోసెఫ్‌ వేసిన 16.5 బంతికి గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. క్రీజులోకి వచ్చిన దూకుడుగా ఆడిన సామ్​ కరణ్​(22) కూడా పెవిలియన్​ చేరాడు. మోహిత్​ శర్మ వేసిన చక్కటి బంతికి శుభమన్ గిల్​కు క్యాచ్​ ఇచ్చిన వెనుదిరిగాడు. కాస్త స్కోరు బోర్డు పరిగెత్తించిన షారుఖ్ ఖాన్​(22) రనౌటయ్యాడు. రిషి ధావన్​ కూడా డకౌటయ్యాడు. హర్​ప్రీత్​ బ్రార్​(*) నాటౌట్​గా నిలిచాడు. ఫలితంగా పంజాబ్​ జట్టు 153 పరుగుల స్కోరు సాధించింది.

మోహిత్‌ శర్మ అరంగేట్రం
గతంలో ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ జట్ల తరఫున ఆడిన ప్లేయర్​ మోహిత్‌ శర్మ ఈ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున ఆడుతున్నాడు. పంజాబ్‌తో జరిగే నేటి మ్యాచ్‌తో అతడు గుజరాత్ తరఫున అరంగేట్రం చేశాడు.

ABOUT THE AUTHOR

...view details