తెలంగాణ

telangana

By

Published : Apr 17, 2022, 7:20 PM IST

ETV Bharat / sports

సన్​రైజర్స్​ జైత్రయాత్ర.. పంజాబ్​పై ఘన విజయం

IPL 2022 PBKS VS SRH: ఐపీఎల్​ 15వ సీజన్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టు విజయ యాత్రను కొనసాగిస్తోంది. పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో 7 వికెట్ల తేడాతో గెలిచింది.

సన్​రైజర్స్​ జైత్రయాత్ర.. పంజాబ్​పై ఘన విజయం
సన్​రైజర్స్​ జైత్రయాత్ర.. పంజాబ్​పై ఘన విజయం

IPL 2022 PBKS VS SRH: ఐపీఎల్​ మెగా లీగ్​లో భాగంగా పంజాబ్ కింగ్స్​తో ఆదివారం జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్ విజయం సాధించింది. పంజాబ్​ నిర్దేశించిన లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించి 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. పంజాబ్​ నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్​రైజర్స్​ బ్యాటర్లు అభిషేక్​ శర్మ, విలియమ్​సన్​ శుభారంభం చేశారు. ధాటిగా ఆడుతున్న అభిషేక్​ శర్మను(31) షారుక్​ఖాన్​ పెవిలియన్​కు పంపాడు. మరో ఓపెనర్​ కెప్టెన్​ విలియమ్సన్​(3) పరుగులే ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్​ త్రిపాఠి(34) మెరుగ్గా రాణించాడు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన మార్​క్రమ్​(41), నికోలస్​ పూరన్​(35) నాటౌట్​గా నిలిచి జట్టును విజయతీరాలకు తీర్చారు. పంజాబ్​ బౌలర్లలో రబాడ 2 వికెట్లు తీయగా.. రబాడ ఓ వికెట్​ తీశాడు.

టాస్​ ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన పంజాబ్​కు ఆదిలోనే షాక్​ తగిలింది. తాత్కాలిక కెప్టెన్​ శిఖర్​ ధావన్​(8) పరుగులకే పెవిలియన్​ చేరాడు. మరో ఓపెనర్​ ప్రభ్​సిమ్రన్​(14) పరుగులకే ఓటయ్యాడు. లివింగ్​ స్టోన్​(60), షారుక్​ ఖాన్​(26) స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. బౌండరీలతో అదరగొట్టిన లివింగ్​స్టోన్​ను విలియమ్​సన్ తన బంతితో పెవిలియన్​కు పంపాడు. తర్వాత వచ్చిన బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఉమ్రాన్‌ మాలిక్‌ (4/28) నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడగా.. పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో 151 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఆఖరి ఓవర్‌లో ఉమ్రాన్‌ ఏకంగా 3 వికెట్లు తీసి ఒక్కటంటే ఒక్క పరుగు కూడా ఇ‍వ్వలేదు. ఆఖరి బంతికి అర్షదీప్‌ కూడా రనౌట్‌ కాగా.. ఈ ఓవర్‌లో పంజాబ్‌ మొత్తం 4 వికెట్లు కోల్పోయి ఒక్క పరుగు కూడా చేయలేకపోయింది. సన్​రైజర్స్​ బౌలర్లలో భువనేశ్వర్​ 3, ఉమ్రాన్​ 4, నటరాజన్​, సుచిత్​ తలో ఒక వికెట్​ పడగొట్టారు.

ABOUT THE AUTHOR

...view details