IPL 2022: భారత టీ20 లీగ్లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబయి. హిట్మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యంలో ఆ జట్టు ఇప్పటికే ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచి ప్రత్యేక గుర్తింపు సాధించింది. అయితే, అంత గొప్ప రికార్డున్న ముంబయి గత సీజన్లో ప్లేఆఫ్స్ కూడా చేరకుండా ఇంటి ముఖం పట్టగా.. ఈసారి మరింత దారుణంగా తడబడుతోంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ ఓటమిపాలై పాయింట్ల పట్టికలో చివర్లో కొనసాగుతోంది. ఇక్కడ నెట్ రన్రేట్ కూడా (-1.072) మైనస్లో ఉండటం ఆ జట్టు పరిస్థితిని తెలియజేస్తుంది. ఇది ముంబయి అభిమానులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ముంబయి ప్లేఆఫ్స్ చేరుతుందా.. లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో మిగతా జట్లన్నీ (చెన్నై మినహా) రెండు మూడు ఓటములు తప్ప బాగానే ఆడుతున్నాయి. దీంతో ప్లేఆఫ్స్ రేసులో ఎవరు నిలుస్తారనేది చెప్పడం చాలా కష్టంగా మారింది. అలాంటప్పుడు ముంబయి నాకౌట్ దశకు చేరుకునే అవకాశాలు కూడా మరింత సంక్లిష్టంగా మారే పరిస్థితులు ఉన్నాయి. అయితే, ఇక్కడ ఊరటగొలిపే ఒక్క విషయం.. ముంబయి ఇప్పటికీ ప్లేఆఫ్స్ చేరే వీలుంది.