తెలంగాణ

telangana

By

Published : Sep 22, 2021, 11:07 AM IST

Updated : Sep 22, 2021, 11:48 AM IST

ETV Bharat / sports

IPL 2021: రాజస్థాన్​ రాయల్స్​ జట్టుకు షాక్

రాజస్థాన్​ రాయల్స్​ జట్టు కెప్టెన్​ సంజూ శాంసన్​కు(Sanju Samson News) ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం పంజాబ్​ కింగ్స్​ జట్టుతో జరిగిన మ్యాచ్​లో స్లోఓవర్​ రేటు కారణంగా(Slow Over Rate in IPL 2021) అతడికి రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్​(IPL 2021) నిర్వాహకులు ప్రకటించారు.

IPL 2021 RR Vs PBKS: RR Captain Sanju Samson Fined Rs 12 Lakh for Slow Over Rate
IPL 2021: రాజస్థాన్​ రాయల్స్​ జట్టుకు షాక్

ఐపీఎల్​లో(IPL 2021) మంగళవారం జరిగిన మ్యాచ్​లో పంజాబ్​ కింగ్స్​పై 2 పరుగుల తేడాతో రాజస్థాన్​ రాయల్స్​(RR Vs PBKS) విజయం సాధించింది. టోర్నీ రెండోదశలో తొలిమ్యాచ్​ విజయాన్ని ఆస్వాదిస్తున్న రాజస్థాన్​ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్​ రేటు కారణంగా(Slow Over Rate in IPL) ఆ జట్టు కెప్టెన్​ సంజూ శాంసన్​కు(Sanju Samson News) రూ.12 లక్షల జరిమానాను ఐపీఎల్​ నిర్వాహకులు విధించారు.

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్​) మార్గదర్శకాల(Slow Over Rate Rules in IPL) ప్రకారం లీగ్​లో తొలిసారి ఓవర్​ రేటు నిబంధనలను ఉల్లంఘిస్తే.. సదరు జట్టు కెప్టెన్​కు రూ.12 లక్షల జరిమానా విధిస్తారు. అదే తప్పు మళ్లీ చేస్తే.. రూ.24 లక్షలతో పాటు తుదిజట్టులోని ప్రతి ఆటగాడి మ్యాచ్​ ఫీజులో 25 శాతం కోత పడుతుంది. మూడోసారి ఇదే తప్పు చేస్తే రూ.30 లక్షల జరిమానా సహా మ్యాచ్​ నిషేధం.. తుదిజట్టులోని ఆటగాళ్లకు రూ.12 లక్షల జరిమానా లేదా మ్యాచ్​ ఫీజులో 50 శాతం కోత విధిస్తారు.

ఇదీ చూడండి..PBKS Vs RR: పంజాబ్​ ఓటమికి కారణం అతడే!

Last Updated : Sep 22, 2021, 11:48 AM IST

ABOUT THE AUTHOR

...view details